AI Mission: భారత AI మిషన్ కోసం రూ. 10,372 కోట్లు.. ఆమోదం తెలిపిన క్యాబినెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Mission: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కృత్రిమ మేధ(AI) టెక్నాలజీపై దృష్టిసారించాయి. భవిష్యత్ కాలంలో టెక్ రంగాన్ని ఏఐ శాసిస్తోందని చెబుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలు ఏఐ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఈ రంగంపై ఆసక్తి చూపిస్తోంది.
భారతదేశంలే AI అభివృద్ధికి సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో, కేంద్ర మంత్రివర్గం గురువారం రూ.10,372 కోట్లతో AI మిషన్ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో యువకులను ఎడ్యుకేట్ చేయడం, ఇన్నోవేషన్ సెంటర్లను ప్రారంభించడం, కంప్యూట్ కెపాసిటీని సృష్టించడం వరకు ఎండ్ టూ ఎండ్ స్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం ఈ మిషన్ ఉద్దేశం. ప్రతీ పౌరుడికి సాంకేతిక ప్రజాస్వామ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రధాని నరేంద్రమోడీ దార్మనికతకు అనుగుణంగా ఈ మిషన్ ఉంటుందని, దానికి అనుగుణంగా రూ. 10,372 కోట్ల మూలధన వ్యయంతో ఈ మిషన్ని క్యాబినెట్ ఆమోదించినట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
Also Read
- Modi-Putin: పుతిన్కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
- Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
Read Also: Radhika Marchant : రాధిక మర్చంట్ ధరించిన ఈ డ్రెస్సును రెడీ చెయ్యడానికి ఎన్నినెలలు పట్టిందో తెలుసా?
ఏఐ మిషన్ స్టార్టప్ అవసరాలను తీర్చడానికి ఈ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడానికి 10,000 కంటే ఎక్కువ ప్రాసెసింగ్ యూనిట్ల(GPU) కంప్యూట్ కెపాసిటీని రూపొందించేందుకు ప్రభుత్వ-ప్రైవేట్ రంగాలు సహకరిస్తాయని అధికార ప్రకటన తెలియజేసింది. మల్టిపుల్ డేటా మోడల్స్తో పనిచేయగల వ్యవసాయం, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో సహాయపడే లార్జ్ మల్టీ మోడల్స్ని అభివృద్ధి చేయడానికి AI ఇన్నోవేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబడనున్నాయి. AI నైపుణ్యం వ్యాప్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ స్థాయిలలో ఈ విభాగంలోని కోర్సులు సులభతరం చేయబడతాయని, టైర్-2, టైర్-3 నగరాల్లో ఫౌండేషన్ స్థాయి కోర్సులను అందించేందుకు 200 AI మరియు డేటా ల్యాబ్లు ఏర్పాటు చేయబడనున్నాయి.
తాజావార్తలు
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Modi-Putin: పుతిన్కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
-
Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
-
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?