PM Ujjwala Yojana: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. గ్యాస్ సిలిండర్పై రూ.300 సబ్సిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Ujjwala Yojana: పీఎం ఉజ్వల పథకం కింద ఎల్పీజీ సిలిండర్లు తీసుకుంటున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉజ్వల పథకం కింద లభించే ఎల్పీజీ సిలిండర్పై ప్రభుత్వం సబ్సిడీని 300 రూపాయలకు పెంచింది. కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉజ్వల పథకం కింద ఎల్పీజీ సిలిండర్పై రూ.200 సబ్సిడీ లభించేది. కేంద్ర ప్రభుత్వం నుండి సిలిండర్పై రూ.300 సబ్సిడీ పొందిన తర్వాత, ఢిల్లీలోని ఉజ్వల పథకం లబ్ధిదారులు రూ.603కి 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ను పొందుతారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు దేశీయ ఎల్పీజీ సిలిండర్ను ముంబైలో రూ.602.50, కోల్కతాలో రూ.629, చెన్నైలో రూ.618.50కి పొందుతారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని ఎల్పీజి సిలిండర్కు రూ. 200 నుంచి రూ. 300కి పెంచిందని.. కేబినెట్ నిర్ణయాలపై బ్రీఫింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
Also Read: Pakistan: పాక్ వదిలి వెళ్లాలి.. 17 లక్షల మందికి నవంబర్ 1 డెడ్లైన్
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
9.6 కోట్ల మందికి లబ్ధి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారుల సంఖ్య 9.6 కోట్లుగా ఉంది. దీనివల్ల సబ్సిడీ పెంపుతో దేశంలోని 9.6 కోట్ల మంది ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద, ప్రభుత్వం పేద ప్రజలకు రాయితీ ధరలకు ఎల్పీజీ సిలిండర్లను అందిస్తుంది. ఈ కారణంగా, సెప్టెంబర్ నెలలో, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద చమురు మార్కెటింగ్ కంపెనీలకు 75 లక్షల ఎల్పీజి కనెక్షన్లను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 1650 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ డబ్బును ఉజ్వల పథకం కింద కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు వినియోగిస్తారు. 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉజ్వల పథకం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు పెరగనుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దీన్ని 2016లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..