PM Ujjwala Yojana: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. గ్యాస్ సిలిండర్పై రూ.300 సబ్సిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Ujjwala Yojana: పీఎం ఉజ్వల పథకం కింద ఎల్పీజీ సిలిండర్లు తీసుకుంటున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉజ్వల పథకం కింద లభించే ఎల్పీజీ సిలిండర్పై ప్రభుత్వం సబ్సిడీని 300 రూపాయలకు పెంచింది. కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉజ్వల పథకం కింద ఎల్పీజీ సిలిండర్పై రూ.200 సబ్సిడీ లభించేది. కేంద్ర ప్రభుత్వం నుండి సిలిండర్పై రూ.300 సబ్సిడీ పొందిన తర్వాత, ఢిల్లీలోని ఉజ్వల పథకం లబ్ధిదారులు రూ.603కి 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ను పొందుతారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు దేశీయ ఎల్పీజీ సిలిండర్ను ముంబైలో రూ.602.50, కోల్కతాలో రూ.629, చెన్నైలో రూ.618.50కి పొందుతారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని ఎల్పీజి సిలిండర్కు రూ. 200 నుంచి రూ. 300కి పెంచిందని.. కేబినెట్ నిర్ణయాలపై బ్రీఫింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
Also Read: Pakistan: పాక్ వదిలి వెళ్లాలి.. 17 లక్షల మందికి నవంబర్ 1 డెడ్లైన్
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
9.6 కోట్ల మందికి లబ్ధి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారుల సంఖ్య 9.6 కోట్లుగా ఉంది. దీనివల్ల సబ్సిడీ పెంపుతో దేశంలోని 9.6 కోట్ల మంది ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద, ప్రభుత్వం పేద ప్రజలకు రాయితీ ధరలకు ఎల్పీజీ సిలిండర్లను అందిస్తుంది. ఈ కారణంగా, సెప్టెంబర్ నెలలో, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద చమురు మార్కెటింగ్ కంపెనీలకు 75 లక్షల ఎల్పీజి కనెక్షన్లను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 1650 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ డబ్బును ఉజ్వల పథకం కింద కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు వినియోగిస్తారు. 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉజ్వల పథకం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు పెరగనుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దీన్ని 2016లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు.
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!