PM Ujjwala Yojana: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. గ్యాస్ సిలిండర్పై రూ.300 సబ్సిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Ujjwala Yojana: పీఎం ఉజ్వల పథకం కింద ఎల్పీజీ సిలిండర్లు తీసుకుంటున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉజ్వల పథకం కింద లభించే ఎల్పీజీ సిలిండర్పై ప్రభుత్వం సబ్సిడీని 300 రూపాయలకు పెంచింది. కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉజ్వల పథకం కింద ఎల్పీజీ సిలిండర్పై రూ.200 సబ్సిడీ లభించేది. కేంద్ర ప్రభుత్వం నుండి సిలిండర్పై రూ.300 సబ్సిడీ పొందిన తర్వాత, ఢిల్లీలోని ఉజ్వల పథకం లబ్ధిదారులు రూ.603కి 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ను పొందుతారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు దేశీయ ఎల్పీజీ సిలిండర్ను ముంబైలో రూ.602.50, కోల్కతాలో రూ.629, చెన్నైలో రూ.618.50కి పొందుతారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని ఎల్పీజి సిలిండర్కు రూ. 200 నుంచి రూ. 300కి పెంచిందని.. కేబినెట్ నిర్ణయాలపై బ్రీఫింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
Also Read: Pakistan: పాక్ వదిలి వెళ్లాలి.. 17 లక్షల మందికి నవంబర్ 1 డెడ్లైన్
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
9.6 కోట్ల మందికి లబ్ధి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారుల సంఖ్య 9.6 కోట్లుగా ఉంది. దీనివల్ల సబ్సిడీ పెంపుతో దేశంలోని 9.6 కోట్ల మంది ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద, ప్రభుత్వం పేద ప్రజలకు రాయితీ ధరలకు ఎల్పీజీ సిలిండర్లను అందిస్తుంది. ఈ కారణంగా, సెప్టెంబర్ నెలలో, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద చమురు మార్కెటింగ్ కంపెనీలకు 75 లక్షల ఎల్పీజి కనెక్షన్లను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 1650 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ డబ్బును ఉజ్వల పథకం కింద కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు వినియోగిస్తారు. 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉజ్వల పథకం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు పెరగనుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దీన్ని 2016లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!