Madhya Pradesh: ప్రస్తుత కాలంలో సాధారణ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి అంటేనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివాహాలు చేస్తున్నారు. కానీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుమారుడు మాత్రం ఈ విషయంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Shocking: మధ్యప్రదేశ్లో షాకింగ్ సంఘటన జరిగింది. అబ్బాయికి, అమ్మాయికి పెళ్లి చేయాల్సింది పోయి, వారి పేరెంట్స్ లేచిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి, తన కూతురుకు కాబోయే అత్తగారితో లేచిపోయాడు. వధువు తండ్రి, వరుడి తల్లి ఇద్దరు కలిసి పారిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది. పిల్లల నిశ్చితార్థానికి కొన్ని రోజుల ముందు ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీలో 8 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. గురువారం పోలీసులు పారిపోయిన మహిళను కనుగొన్నారు.
Liquor Ban : మధ్యప్రదేశ్లో మొదటి నుండి మద్యపాన నిషేధం ఒక పెద్ద సమస్యగా ఉంది. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు నిరంతరం మద్యపాన నిషేధం కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.
క్రైస్తవుల అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్కు ముందు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో చర్చిలను అలంకరించారు. ఈ నేపథ్యంలో ఓ చర్చిపై 'ఆలయం'(మందిర్) అని రాశారు. దీనికి హిందూ సంస్థల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొత్త వివాదం తలెత్తింది.
Ujjain: విషాదకర సంఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆమె ధరించిన దుపట్టానే మెడకు ఉరితాడులా బిగుసుకుపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలోని ఫుడ్ సెంటర్లో చోటు చేసుకుంది. బంగాళాదుంపల తొక్క తీసే యంత్రంలో దుపట్టా చిక్కుకుపోయింది. దీంతో మెడకకు బిగుసుకుపోవడంతో 30 ఏళ్ల మహిళ శనివారం మరణించినట్లు అధికారులు తెలిపారు.
మసీదులో ఆలయానికి సంబంధించిన ఆధారాలు దొరికితే అక్కడ గొప్ప ఆలయాన్ని నిర్మిస్తామని బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. దీనితో పాటు.. 2029 నాటికి భారతదేశం హిందూ దేశంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయానికి రాజా సింగ్ చేరుకున్నారు. మహాకాళ్ దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న మతపరమైన సంక్షోభాన్ని బాబా మహాకాళ్ ఆశీస్సులతో ఎదుర్కోవాలని ఆకాంక్షించారు.
Ujjain Mahakaleshwar temple: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో శ్రీ మహాకాళేశ్వరాలయం ఉంది. బాబా మహాకాళుని దర్శనం కోసం దేశంలోని నలుమూలల నుండి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
రేపు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో దేశంలోనే అత్యున్నతమైన వివాహం జరగనుంది. పెళ్లికి హాజరయ్యేందుకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అతిథులు వస్తున్నారు.
Fire In Temple: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం జరిగింది. గర్భగుడిలో హోలీ రోజున జరిగే భస్మ హారతి సందర్భంగా గులాల్ ఊదడంతో మంటలు వ్యాపించడంతో పాటు 13 మంది కాలి బూడిదయ్యారు.