Ujjain Mahakaleshwar temple: ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ ప్రసాదానికి సేఫ్ భాగ్ అవార్డు.. ఎలా తయారు చేస్తారంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ujjain Mahakaleshwar temple: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో శ్రీ మహాకాళేశ్వరాలయం ఉంది. బాబా మహాకాళుని దర్శనం కోసం దేశంలోని నలుమూలల నుండి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ సమయంలో భక్తులు తమతో పాటు శెనగపిండి లడ్డూల ప్రసాదాన్ని కూడా తీసుకుంటారు. ఈ ప్రసాదాన్ని శ్రీ మహాకాళేశ్వర నిర్వహణ కమిటీ భక్తుల కోసం సిద్ధం చేసింది. శ్రీ మహాకాళేశ్వర నిర్వహణ కమిటీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ పీయూష్ త్రిపాఠి మాట్లాడుతూ బాబా మహాకాల్కు సమర్పించే ఈ ప్రసాదాన్ని పూర్తి స్వచ్ఛతతో తయారు చేసినట్లు తెలిపారు. చింతామన్, ఉజ్జయిని సమీపంలో ఉన్న ఒక యూనిట్లో శనగపిండి లడ్డులను తయారు చేస్తారు. ఈ యూనిట్లో ప్రతిరోజు 25 నుంచి 30 క్వింటాళ్ల లడ్డూ ప్రసాదం తయారవుతుండగా, ప్రత్యేక పండుగల్లో దాదాపు 50 నుంచి 60 క్వింటాళ్ల లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు.
ఈ యూనిట్లో దాదాపు 60 మంది పనిచేస్తున్నారు. ప్రసాదం తయారీలో ఎలాంటి మలినాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రసాదం చేసే ముందు ఉద్యోగులంతా చేతులు కడుక్కోవాలి. వారు తలపై టోపీ ధరిస్తారు. ఆ తర్వాతే ప్రసాదం తయారీ ప్రారంభమవుతుంది. శనగ పిండి కోసం నాణ్యమైన పప్పును కొనుగోలు చేస్తారు. ఈ పప్పును మిల్లులో రుబ్బి శనగపిండిని తయారుచేస్తారు. లడ్డూల తయారీ సమయంలో.. దానికి జోడించిన డ్రై ఫ్రూట్స్ బాగా ఉన్నాయా లేదా అనేది కూడా మొదట ప్రయోగశాలలో టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్రసాదంలో కలుపుతారు. శ్రీ మహాకాళేశ్వర్ మేనేజ్మెంట్ కమిటీ ప్రకారం.. ఈ ప్రసాదం చాలా స్వచ్ఛమైనది, శ్రీ మహాకాళేశ్వర నిర్వహణ కమిటీ ఈ ప్రసాదానికి సేఫ్ భోగ్ అవార్డుతో పాటు ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా అందుకుంది.
Also Read
- AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
- Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
- Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
ధర ఎంత?
బాబా మహాకాళ్ దర్శనానికి వచ్చే భక్తులకు వారి సౌకర్యానికి అనుగుణంగా లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. మహాకాళేశ్వరాలయంలో రోజూ 25 నుంచి 30 క్వింటాళ్ల లడ్డూలు వినియోగిస్తారు. సుదూర ప్రాంతాల నుండి బాబా మహాకాళ దర్శనం కోసం వచ్చే భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ నుండి 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు, 1 కిలోల ప్యాకెట్లలో ఈ ప్రసాదాన్ని కొనుగోలు చేస్తారు. శ్రీ మహాకాళేశ్వర నిర్వహణ కమిటీ ఈ ప్రసాదాన్ని కిలో రూ.400 ధరకే భక్తులకు అందుబాటులో ఉంచింది.
తాజావార్తలు
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
-
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!