Ujjain Mahakaleshwar temple: ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ ప్రసాదానికి సేఫ్ భాగ్ అవార్డు.. ఎలా తయారు చేస్తారంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ujjain Mahakaleshwar temple: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో శ్రీ మహాకాళేశ్వరాలయం ఉంది. బాబా మహాకాళుని దర్శనం కోసం దేశంలోని నలుమూలల నుండి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ సమయంలో భక్తులు తమతో పాటు శెనగపిండి లడ్డూల ప్రసాదాన్ని కూడా తీసుకుంటారు. ఈ ప్రసాదాన్ని శ్రీ మహాకాళేశ్వర నిర్వహణ కమిటీ భక్తుల కోసం సిద్ధం చేసింది. శ్రీ మహాకాళేశ్వర నిర్వహణ కమిటీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ పీయూష్ త్రిపాఠి మాట్లాడుతూ బాబా మహాకాల్కు సమర్పించే ఈ ప్రసాదాన్ని పూర్తి స్వచ్ఛతతో తయారు చేసినట్లు తెలిపారు. చింతామన్, ఉజ్జయిని సమీపంలో ఉన్న ఒక యూనిట్లో శనగపిండి లడ్డులను తయారు చేస్తారు. ఈ యూనిట్లో ప్రతిరోజు 25 నుంచి 30 క్వింటాళ్ల లడ్డూ ప్రసాదం తయారవుతుండగా, ప్రత్యేక పండుగల్లో దాదాపు 50 నుంచి 60 క్వింటాళ్ల లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు.
ఈ యూనిట్లో దాదాపు 60 మంది పనిచేస్తున్నారు. ప్రసాదం తయారీలో ఎలాంటి మలినాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రసాదం చేసే ముందు ఉద్యోగులంతా చేతులు కడుక్కోవాలి. వారు తలపై టోపీ ధరిస్తారు. ఆ తర్వాతే ప్రసాదం తయారీ ప్రారంభమవుతుంది. శనగ పిండి కోసం నాణ్యమైన పప్పును కొనుగోలు చేస్తారు. ఈ పప్పును మిల్లులో రుబ్బి శనగపిండిని తయారుచేస్తారు. లడ్డూల తయారీ సమయంలో.. దానికి జోడించిన డ్రై ఫ్రూట్స్ బాగా ఉన్నాయా లేదా అనేది కూడా మొదట ప్రయోగశాలలో టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్రసాదంలో కలుపుతారు. శ్రీ మహాకాళేశ్వర్ మేనేజ్మెంట్ కమిటీ ప్రకారం.. ఈ ప్రసాదం చాలా స్వచ్ఛమైనది, శ్రీ మహాకాళేశ్వర నిర్వహణ కమిటీ ఈ ప్రసాదానికి సేఫ్ భోగ్ అవార్డుతో పాటు ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా అందుకుంది.
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ధర ఎంత?
బాబా మహాకాళ్ దర్శనానికి వచ్చే భక్తులకు వారి సౌకర్యానికి అనుగుణంగా లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. మహాకాళేశ్వరాలయంలో రోజూ 25 నుంచి 30 క్వింటాళ్ల లడ్డూలు వినియోగిస్తారు. సుదూర ప్రాంతాల నుండి బాబా మహాకాళ దర్శనం కోసం వచ్చే భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ నుండి 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు, 1 కిలోల ప్యాకెట్లలో ఈ ప్రసాదాన్ని కొనుగోలు చేస్తారు. శ్రీ మహాకాళేశ్వర నిర్వహణ కమిటీ ఈ ప్రసాదాన్ని కిలో రూ.400 ధరకే భక్తులకు అందుబాటులో ఉంచింది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!