తెలంగాణలో మేడారం జాతర ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా ఈ జాతర కోసం ప్రజలు లక్షలాదిగా తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రైవేట్ వాహనాల యజమానులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో టీఎస్ఆర్టీసీ రంగంలోకి దిగింది. ప్రజలు ఆర్టీసీ బస్సులనే ఎక్కాలంటూ వినూత్నంగా ప్రమోషన్లు చేస్తోంది. గతంలో ఎన్నో కొత్త సినిమాలను ఆర్టీసీ బస్సుల ప్రమోషన్ల కోసం వాడుకున్న టీఎస్ఆర్టీసీ తాజాగా సూపర్స్టార్ మహేష్బాబు కొత్త సినిమా సర్కారు వారి పాటను వాడేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..…
ద్వైవార్షిక ఉత్సవాల సందర్భంగా సమ్మక్క-సారలమ్మ దేవతలను పూజించేందుకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC), మంచిర్యాల డివిజన్ నుండి ములుగు జిల్లా మేడారంకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించింది. కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ ఎం.మల్లేశయ్య ఆదివారం బస్సు సర్వీసులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లేశయ్య మాట్లాడుతూ.. జాతరలో పాల్గొనే భక్తులను మేడారం తరలించేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపారు. ఉదయం 7.30 గంటలకు మంచిర్యాలలో ఒక బస్సు బయలుదేరుతుందని,…
తెలంగాణలో ప్రయాణికులకు సేవలు అందిస్తూ మరింత చేరువ అయింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంస్థ యాజమాన్యం కొత్త వెబ్ సైట్ కి శ్రీకారం చుట్టింది. టీఎస్ఆర్టీసీ సంస్థ కొత్త వెబ్సైట్ tsrtc.telangana.gov.in ను ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి, ఎండీ సజ్జనార్లు ఆవిష్కరించారు. ఆర్టీసీ నూతన వెబ్సైట్ చాలా బాగుందని.. సామాన్యులు సైతం సులభంగా వినియోగించుకొనేలా ఉందని ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ అన్నారు. గతంలో వున్న ఆర్టీసీ వెబ్ సైట్ కు మార్పులు…
సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీకి కలిసొచ్చింది. పండుగ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రయాణికులకు మంచి సేవలు అందించడమే కాకుండా… వారం రోజుల వ్యవధిలోనే భారీ ఆదాయాన్ని ఆర్జించింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ. ఎలాంటి అదనపు ఛార్జీలు ప్రయాణికుల వద్ద నుంచి వసూలు చేయకుండానే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. సంక్రాంతి సందర్భంగా టీఎస్ ఆర్టీసీ అదనంగా 55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది.షెడ్యూల్ బస్సులతో పాటు అదనంగా 4 వేల బస్సులను సంస్థ…
టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి వీసీ సజ్జనార్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. టీఎస్ఆర్టీసీలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తున్న ప్రయాణికుల సమస్యలు క్షణాల్లోనే తీర్చతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యువతి అర్థరాత్రి టీఎస్ఆర్టీసీ, ఎండీ సజ్జనార్ను ట్యాగ్ చేస్తూ ట్విట్ చేసింది. దీంతో సజ్జనార్ వెంటనే స్పందించారు. అయితే అర్ధరాత్రి సమయాలలో ఆర్టీసీ బస్సులలో మహిళల సౌకర్యం కోసం (వాష్ రూమ్స్) బస్సులను పెట్రోల్ పంప్లలో 10 నిమిషాలు…
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు లేనట్లేనా? ముఖ్యమంత్రి హామీ పై ఉన్నతాధికారులు కసరత్తు చేయలేదా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన వరం కార్పొరేషన్ ఉద్యోగులకు వర్తించదా? ఆర్టీసీ ఎంప్లాయిస్ రిటైర్మెంట్ ఏజ్ పై ఉద్యోగులు ఏమంటున్నారు?. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అంశం మరోసారి చర్చకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కార్పొరేషన్ల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. అప్పట్లోనే ఆర్టీసీ కూడా తన ఉద్యోగులకు దాన్ని వర్తింప…
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతికి 4,318 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. అయితే సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలోప్రత్యేక బస్సులు ఈ నెల 7 నుంచి 14 వరకు నడపనున్నట్టు వెల్లడించారు. 4,318 ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు నడుస్తాయని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్కు కూడా భారీ సంఖ్యలో టీఎస్…
ఐపీఎస్ అధికారి సజ్జనార్.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరి స్తున్నారు. ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా మరో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది.. సొంత ఊర్లకు వెళ్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏపీకి చెందిన వారు.. ఊర్లకు వెళ్తారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీకి దిమ్మ తిరిగే కౌంటర్…
టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి వీసీ సజ్జనార్ ఆర్టీసీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కొత్తకొత్త ఆలోచనలతో ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపేందకు కృషి చేస్తున్నారు. అయితే సజ్జనార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళ కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకే డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు చేరుకునేలా డ్యూటీలు వేయాలని సూచించారు. అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు ఈ దేశాలను పాటించాలన్నారు.…
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచి మేడారం జాతరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అసియాలోనే అతిపెద్ద జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈ జాతరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం జాతర కొరకు ప్రత్యేకంగా 3,845 బస్సులను ఏర్పాటు…