తెలంగాణలో ప్రయాణికులకు సేవలు అందిస్తూ మరింత చేరువ అయింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంస్థ యాజమాన్యం కొత్త వెబ్ సైట్ కి శ్రీకారం చుట్టింది. టీఎస్ఆర్టీసీ సంస్థ కొత్త వెబ్సైట్ tsrtc.telangana.gov.in ను ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి, ఎండీ సజ్జనార్లు ఆవిష్కరించారు. ఆర్టీసీ నూతన వెబ్సైట్ చాలా బాగుందని.. సామాన్యులు సైతం సులభంగా వినియోగించుకొనేలా ఉందని ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ అన్నారు.
గతంలో వున్న ఆర్టీసీ వెబ్ సైట్ కు మార్పులు చేసి అదనపు హంగులతో దీనిని రూపొందించారు. కొత్త వెబ్సైట్ను సందర్శించి, ఆర్టీసీ అభివృద్ధికి సంబంధించి విలువైన అభిప్రాయాలు, సూచనలను పంపాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతకుముందు బస్భవన్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఛైర్మన్ గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్లు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు. ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలు తీసుకువస్తున్నారు. ఆర్టీసీలో వినూత్నమయిన విధానాలతో, సోషల్ మీడియాలో ప్రయాణికులకు అందుబాటులో వుంటున్న సంగతి తెలిసిందే.
Read Also తెలంగాణ కోవిడ్ అప్డేట్.. తగ్గినా.. ఇంకా భారీగానే..