Apple: డొనాల్డ్ ట్రంప్ ‘‘టారిఫ్’’ల పుణ్యామా అని, వీటిని తప్పించుకునేందుకు ప్రపంచ దేశాలు ఎగుమతుల్ని పెంచింది. టారిఫ్స్ అమలులోకి రాకముందే పలు దేశాలు అమెరికాకు ఎగుమతుల్ని పెంచాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూడా ట్రంప్ ఎఫెక్ట్తో ఐఫోన్ ఎగుమతుల్ని పెంచింది. ఏకంగా 600 టన్నుల ఐఫోన్లను విమానంలో అమెరికాకు తరలించింది. ట్రంప్ టారిఫ్లు అమలులోకి వస్తే ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున యూఎస్కి వీటిని తరలించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం సరికొత్త కళ సంతరించుకుంది. ట్రంప్ సుంకాలతో సోమవారం ఇన్వెస్టర్లకు బ్లాక్ మండేగా మారింది. కానీ కొన్ని గంటల్లోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సుంకాలు కారణంగా ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కోవిడ్ సమయంలో ఎదురైన భారీ పతనం.. మరోసారి ట్రంప్ టారిఫ్లు కారణంగా చవిచూశాయి. ఇక ట్రంప్నకు ధీటుగా చైనా కూడా సుంకాలు పెంచేసింది.
ట్రంప్ వాణిజ్య యుద్ధం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం అల్లకల్లోలం అయిపోయింది. ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే భారీ నష్టాలతో ప్రారంభమైంది. సూచీలన్నీ భారీగా పతనం అయిపోయాయి.
Share Market : స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న గందరగోళం ముగిసే సూచనలు కనిపించడం లేదు. గత ట్రేడింగ్ వారంలో భారీ క్షీణతను చూసిన భారత స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ప్రారంభమైంది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సుంకాలతో ప్రపంచ దేశాలును బెదిరిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాల సుంకాలను విధించారు. తాజాగా, ఆయన సుంకాలపై సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. గురువారం ట్రంప్ ‘పరస్పర సుంకాల’ను ఆవిష్కరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
Donlad Trump: డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశాడు. కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేశాడు. మంగళవారం నుంచి పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం, ట్రంప్ చైనా నుండి వచ్చే అన్ని దిగుమతులపై 10 శాతం, మెక్సికో, కెనడా నుండి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో పాటు అధికంగా సుంకాలు విధించే దేశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్ భారత్, చైనా, బ్రెజిల్లను ఉద్దేశిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మూడు దేశాలను ‘‘అత్యంత సుంకాల తయారీదారులు’’గా అభివర్ణించారు. తమ ప్రభుత్వం ఈ మూడు దేశాలను ఈ మార్గంలోనే కొనసాగించడానికి అనుమతించదని, ఆమెరికాని మొదటిస్థానంలో ఉంచబోతున్నాము కాబట్టి ఇకపై అలా జరగనవ్వబోము అని…