Apple: ట్రంప్ ఎఫెక్ట్.. 600 టన్నుల ఐఫోన్లను యూఎస్కి ఎయిర్ లిఫ్ట్ చేసిన ఇండియా..
- ట్రంప్ టారిఫ్స్ తప్పించుకునేందుకు..
- భారత్ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున ఐఫోన్ల ఎగుమతి..
- 600 టన్నుల ఐఫోన్లను తరలించిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple: డొనాల్డ్ ట్రంప్ ‘‘టారిఫ్’’ల పుణ్యామా అని, వీటిని తప్పించుకునేందుకు ప్రపంచ దేశాలు ఎగుమతుల్ని పెంచింది. టారిఫ్స్ అమలులోకి రాకముందే పలు దేశాలు అమెరికాకు ఎగుమతుల్ని పెంచాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూడా ట్రంప్ ఎఫెక్ట్తో ఐఫోన్ ఎగుమతుల్ని పెంచింది. ఏకంగా 600 టన్నుల ఐఫోన్లను విమానంలో అమెరికాకు తరలించింది. ట్రంప్ టారిఫ్లు అమలులోకి వస్తే ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున యూఎస్కి వీటిని తరలించింది.
టెక్ దిగ్గజం ఆపిల్ చార్టర్డ్ కార్గో విమానాల ద్వారా భారత్ నుంచి అమెరికాకు 600 టన్నుల ఫోన్లను, అంటే దాదాపుగా 1.5 మిలియన్ల ఫోన్ల తరలించినట్లు రాయిటర్స్ తెలిపింది. ఆపిల్ పరికరాలకు ప్రధాన తయారీ కేంద్రంగా చైనా ఉంది. చైనాపై ట్రంప్ 125 శాతం సుంకాలు విధించడంతో వీటి ధరలు పెరుగుతాయని విశ్లేషకులు హెచ్చరించారు. భారత్పై 26 శాతం సుంకాలను ట్రంప్ విధించాడు. అయితే, చైనా మినహా మిగిలిన అన్ని ప్రపంచదేశాలకు మూడు నెలల వరకు సుంకాల విరామం ప్రకటించింది.
Also Read
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
Read Also: Tahawwur Rana: కసబ్కి కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది.. తహవూర్ రాణా అప్పగింతపై కేంద్రమంత్రి..
ఐఫోన్లను అమెరికాకు తరలించడానికి, చెన్నైలో కస్టమ్స్ క్లియర్ చేయడానికి అవసరమైన 30 గంటల సమయాన్ని 6 గంటలకు తగ్గించినట్లు తెలుస్తోంది. దీని కోసం ‘‘గ్రీన్ కారిడార్’’ ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్చి నుంచి 100 టన్నుల సామర్థ్యం కలిగిన దాదాపుగా ఆరు కార్గో జెట్లు అమెరికాకు బయలుదేరాయి. వీటిలో ఒకటి సుంకాలు ప్రకటించిన ఈ వారంలో అమెరికాకు వెళ్లింది.
ఐఫోన్ 14 యొక్క ప్యాక్ చేయబడిన బరువు, దాని ఛార్జింగ్ కేబుల్ దాదాపు 350 గ్రాములు. దీనిని బట్టి చూస్తే 600 టన్నుల కార్గో, అంటే దాదాపుగా 1.5 మిలియన్ల ఐఫోన్లు ఉన్నాయని తెలుస్తోంది. ఆపిల్ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది 220 మిలియన్లకు పైగా ఫోన్లను విక్రయించింది. యూఎస్ మొత్తం దిగుమతుల్లో ఐదో వంతు ఇప్పుడు భారత్ నుంచే వెళ్తున్నాయి. మిగిలినవి చైనా నుంచి యూఎస్కి ఎగుమతి అవుతున్నాయి. చెన్నైలోని ఫాక్స్కాన్ ఫ్లాంట్లో ఇప్పుడు ఆదివారాలు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఈ ఈ ప్లాంట్ 20 మిలియన్ ఐఫోన్లను ఉత్పత్తి చేసింది, వీటిలో తాజా ఐఫోన్ 15 మరియు 16 మోడళ్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!