Trump Tariffs: ఆపిల్కి మాత్రమే కాదు, శామ్సంగ్కి కూడా ట్రంప్ టారిఫ్స్ బెదిరింపులు..
- టారిఫ్స్ పేరిట ట్రంప్ బెదిరింపులు..
- ఇప్పటికే ఆపిల్కి 25 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిక..
- శామ్సంగ్కి కూడా తప్పదని వార్నింగ్..
- ప్రొడక్షన్ అమెరికాకు మార్చాలని కోరుతున్న ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పేరుతో బెదిరింపులు ఆపడం లేదు. ఇటీవల, ఆపిల్ అధినేత టిమ్ కుక్తో ట్రంప్ మిడిల్ఈస్ట్ పర్యటనలో భారత్లో ప్లాంట్ నెలకొల్పవద్దని, అమెరికాలో పెట్టాలని కోరారు. “అతను భారతదేశం అంతటా ఫ్లాంట్లు నిర్మిస్తున్నాడు. మీరు భారతదేశంలో ఫ్లాంట్లు నిర్మించడం నాకు ఇష్టం లేదు.” అని ట్రంప్ అన్నారు.
దీని తర్వాత, ఆపిల్ ఉత్పత్తిని అమెరికాకు మార్చకుంటే 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంగళవారం వైట్ హౌస్లో ట్రంప్, ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈ హెచ్చరికలు వచ్చినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు.
Also Read
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
Read Also: Vijayawada: విజయవాడ రైల్వేస్టేషన్కి బాంబు బెదిరింపు.. పాకిస్థాన్కు చెందిన వ్యక్తి ఫోన్ కాల్!
ఇదిలా ఉంటే, ఈ బెదిరింపు కేవలం ఆపిల్కి మాత్రమే కాదని, శామ్సంగ్కి కూడా వర్తిస్తాయని ట్రంప్ చెబుతున్నాడు. ఆపిల్తో సహా శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్తో సహా అందరు తయారీదారులను లక్ష్యంగా చేసుకుంటున్నానని, వారి పొడక్షన్స్ని అమెరికాకు తరలించడానికి ప్రోత్సహించానని ట్రంప్ చెప్పారు. ఇదే కాకుండా, దిగుమతి సుంకాలు సిద్ధంగా ఉన్నాయని, జూన్ చివరి నాటికి అమలు చేయబడుతాయని ట్రంప్ చెప్పాడు.
అంతకుముందు, మంగళవారం టిమ్ కుక్తో భేటీ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ..‘‘ప్లాంట్లను నిర్మించడానికి భారతదేశానికి వెళ్తున్నానని ఆయన అన్నారు. భారతదేశానికి వెళ్లడం సరే, కానీ మీరు సుంకాలు లేకుండా ఇక్కడకు అమ్మబోరు అని నేను చెప్పాను’’ అని ట్రంప్ అన్నారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై ఆపిల్, శామ్సంగ్ స్పందించడానికి నిరాకరించాయి.
చైనాలో తయారైన వస్తువులపై దిగుమతి సుంకాల ప్రభావాన్ని పరిమితం చేయడానికి, ఆపిల్ భారత్లో పెద్ద ఎత్తున ఐఫోన్లు ఉత్పత్తి చేసి, అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఈ చర్య ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. అయితే, బ్లూమ్ బర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం, అమెరికాలో ఉత్పత్తి ఖర్చు, సుంకాలు చెల్లించడం కన్నా ఎక్కువ అవుతుంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!