తెలంగాణ కాంగ్రెస్ చీఫ్గా రేవంత్రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత.. పార్టీలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. ఇదే సమయంలో.. ఆయను టార్గెట్ చేసే బ్యాచ్ కూడా పెద్దదే.. క్రమంగా అందరితో కలిసిపోయే ప్రయత్నాలు జరుగుతున్నా.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై డైలాగ్స్ పేల్చడంలో… జగ్గారెడ్డి ముందు వరుసలో ఉన్నారు.. పార్టీ వ్యక్తిగత ఇమేజ్ కోసం రేవంత్ పని చేస్తున్నారంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. సీనియర్స్ సమావేశం తర్వాత… ఏకంగా రేవంత్కే సవాల్ విసిరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి…
తెలంగాణలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి. యాసంగిలో వరి సాగు తగ్గింది. కేసీఆర్ మాటలకు ఎవ్వరూ కూడా వరి సాగు చేయలేదు. కేంద్రం ధాన్యం కొనాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం రా రైస్ కొంటాం కానీ, బోయిల్డ్ రైస్ కొనమని చెప్తోంది. గత వానాకాలంలో మీరు చేసిన పని వల్ల రైతులు నష్టపోయారు.. గతంలో ప్రభుత్వం ధాన్యం కొనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఇప్పుడు కూడా…
టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి చెక్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన అదనపు బాధ్యతల్లో కోత విధించింది. ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది టీపీసీసీ. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు అప్పగించిన పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తప్పించింది టీపీసీసీ. ఆయనకు గతంలో ఉన్న బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. జగ్గారెడ్డి కి అప్పగించిన బాధ్యతల్లో……
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతుంటాయి. నేతలు కీలక ప్రకటనలతో హోరెత్తిస్తూ వుంటారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంది. అలా అని హద్దు మీరితే అధిష్టానం ఊరుకోదు. గీత దాటితే వేటు తప్పదన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధిష్టానంకి తెలుసు. వ్యక్తిగత సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలన్నారు. పీసీసీలో ఎన్నో కమిటీలు ఉన్నాయి. ఏఐసీసీ కూడా ఉంది. ఏదైనా సమస్య ఉంటే ఏఐసీసీకి…
ఎల్లారెడ్డి బహిరంగ సభకు భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు, జనం. దారి పొడవునా రేవంత్ రెడ్డికి భారీ స్వాగతాలు లభించాయి. గ్రామాలలో, పట్టణాలలో రోడ్డుకు ఇరువైపులా రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికారు ప్రజలు. భారీ గజ పూల మాలలతో, మంగళ హారతులు, తిలకాలు దిద్దారు. రేవంత్ రెడ్డికి స్వాగతం చెప్పారు. ఎల్లారెడ్డి ఆర్టీసీ గ్రౌండ్ లో మన ఊరు, మన పోరు బహిరంగ సభ జరుగుతోంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కి మన ఊరు మన…
ఇప్పటికే ఐఏఎస్ అధికారుల విషయంలో రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు.. ఐఏఎస్ అధికారుల పోస్టింగ్లలో పక్షపాత వైఖరి సరికాదని సూచించారు.. బీహార్ అధికారులే మీకు నచ్చడం.. మెచ్చడం వెనక ఉద్దేశం ఏంటి..? అని లేఖలో ప్రశ్నించిన రేవంత్రెడ్డి… DOPT నిబంధనలకు వ్యతిరేకంగా సోమేష్ కుమార్ని ఎలా సీఎస్ను చేశారని నిలదీశారు.. HMDA, RERAలో అరవింద్, సోమేష్ కుమార్ ఇచ్చిన అనుమతులపై విచారణ జరిపించాలని…
తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించుకోవడంపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గీతారెడ్డి.. మన గ్రాఫ్ పెరుగుతుంది.. సీఎం కేసీఆర్ గ్రాఫ్ తగ్గుతుందన్న ఆమె.. ట్యూషన్ టీచర్ని ఎందుకు పెడతాం..? పిల్లలు వీక్గా ఉంటేనే కదా..? అని ప్రశ్నించారు.. అంటే కేసీఆర్ వీక్ అయ్యాడు కాబట్టే.. ట్యూషన్ టీచర్ని తెచ్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు గీతారెడ్డి.. ఇక, తెలంగాణలో వచ్చేది మన ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు..…
తెలంగాణ కాంగ్రెస్ లో కుదుపునకు కారణం అయ్యారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. పదిహేను రోజుల పాటు తన రాజీనామాకు బ్రేక్ వేసావనన్నారు జగ్గారెడ్డి, సోనియా గాంధీని, రాహుల్ గాంధీ ని కలవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు జగ్గారెడ్డి. ఇదే సమయంలో తాజాగా సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే…
టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. నిర్మల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజక వర్గ స్థాయి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ఏఐసీసీ తరఫున శ్రీనివాస కృష్ణన్, మాణిక్కం ఠాకూర్ హాజరయ్యారు. సమావేశం లో ఏడు నియోజక వర్గాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ లో టీఆర్ఎస్ వైస్ చైర్మన్ ఒక ఎస్సీ మైనర్…
పోయినవాళ్లు పోగా.. ఉన్నవారిలో ఆయన ఒక్కరే స్వపక్షంలో విపక్షం అనుకున్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేదీ అదేదారి. ఒకరికి ఇద్దరయ్యారు. సేమ్ టు సేమ్. వారి గురించే పార్టీలో ప్రస్తుతం చర్చ. వారెవరో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్లోనే ఉంటాననే నమ్మకం కలిగించడం లేదు..!తెలంగాణ కాంగ్రెస్ తీరు మారదా? మంచిరోజులు కనుచూపు మేరలో లేవా? పార్టీలో పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? హస్తం అస్తవ్యస్తమవుతున్నా పట్టించుకోరా? గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలివి. కొన్నిరోజులు ఒకరు.. మరికొన్ని రోజులు…