టాలీవుడ్ లో గత ఐదు రోజులుగా షూటింగ్స్ లేక మూగబోయింది. వేతనాల పెంపుపు పై కార్మిక సంఘాలకు, ఫిల్మ్ ఛాంబర్ కు మధ్య మొదలైన వివాదం బంద్ కు దారి తీసింది. ఈ విషయమై ఈ రోజు పలువురు చిన్న సినిమా నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీ. కళ్యాణ్ : చిన్న సినిమాల నిర్మాతలతో సమావేశం నిర్వహించాము. చిన్న నిర్మాతలు మార్కెటింగ్ లేక థియేటర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.…
How Would Rajinikanth Look Without Makeup Said CPI Narayana: కలామ్మకు సేవ చేసే కార్మికులందరూ రోడ్డున పడ్డారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా అంటే కేవలం డైరెక్టర్, హీరో, హీరోయిన్ కాదని.. కార్మికులు పని చేస్తేనే వారికి పేరొస్తుందన్నారు. హీరోలకు కోట్లలో పారితోషికాలా?, కష్టపడే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వరా? అని ప్రశ్నించారు. హీరో, హీరోయిన్లకు సొగసులు దిద్దే కార్మికులను విస్మరిస్తారా? అని మండిపడ్డారు. ‘సూపర్ స్టార్’ రజనీకాంత్…
హైదరాబాద్ సారథి స్టూడియోస్లో కలకలం రేగింది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో వేతనాల పెంపు కారణంగా షూటింగ్లు జరగడం లేదు. 30% వేతనాలు పెంచి ఇచ్చిన వారికి మాత్రమే షూటింగ్లకు వెళ్లాలని ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయించింది. అలా కొంత మంది వేతనాలు పెంచి షూటింగ్ చేయించుకుంటున్నారు. అయితే, తాజాగా హైదరాబాద్లోని సారథి స్టూడియోస్లో సినీ కాస్ట్యూమర్స్ అసోసియేషన్ సెక్రటరీ, అలాగే ఆ యూనియన్లో ఉన్న ఒక సభ్యుడి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కాస్ట్యూమర్స్ అసోసియేషన్ సెక్రటరీ నరసింహ,…
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ కు చెందిన 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీల పై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలైన విజయ్ దేవరకొండ పాటు రానా ,మంచు లక్ష్మి ల పై ఈడీ కేసు నమోదు చేసింది. ప్రకాష్ రాజ్ ,నిధి అగర్వాల్, మంచు లక్ష్మి ,అనన్య నాగళ్ళ, శ్రీముఖిలపై కేసు నమోదు చేయగా ప్రకాష్ రాజ్ ఇటీవల ఈడీ ఎదుట హాజరయ్యాడు. హైదరాబాద్ సైబరాబాద్…
Betting App Case Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో నేడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు నటుడు ప్రకాష్ రాజ్ను విచారించారు. మళ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఈ రోజు విజయ్ దేవరకొండ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో రౌడీ బాయ్ ఏం చెబుతాడో అని సర్వత్రా…
హరిహర వీరమల్లు సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణ ఆ సినిమాలో త్రివిక్రమ్ ప్రమేయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజానికి సినిమా ఆగిపోయిన తర్వాత మళ్లీ సినిమా మొదలు పెట్టాల్సిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారని, తనకు త్రివిక్రమ్తో టచ్లో ఉండాలని చెప్పారని అన్నారు. తాను అనుకున్న లైన్ తీసుకువెళ్లి త్రివిక్రమ్కి చెప్పగా అది ఆయనకు నచ్చిందని, వెంటనే పవన్ కళ్యాణ్కి జ్యోతి కృష్ణ రెడీగా ఉన్నాడు, సినిమా చేయవచ్చని చెప్పినట్లు వెల్లడించారు. పవన్…
సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్లో ఒకరుగా ఉన్న టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ సమస్య మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నిజానికి తమకు వేతనాలు పెంచి ఇచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్న ఆయన, స్కిల్డ్ వర్కర్స్ లేనప్పుడు ఇప్పుడు ఇస్తున్న వేతనాలే ఇబ్బందికరంగా అనిపిస్తోందని అన్నారు. అలాంటిది స్కిల్ లేకుండా ఇప్పుడు ఇంకా జీతాలు పెంచి వాళ్లకు ఇవ్వడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారుతుందని…
విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ డ్రామా ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న డిజిటల్ ప్రీమియర్కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన J.S.K మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా.. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై J. ఫణీంద్ర…
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ‘ఎస్క్వైర్ ఇండియా’ అనే ఒక మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంతేకాక ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ప్రచురించడంతో ఆయన అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మ్యాగజైన్కి ఇచ్చిన ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు తన కుటుంబానికి సంబంధించిన సినిమాల లెగసీ విషయంలో ఏం జరుగుతుందో తెలియదని, తాను ఆ విషయంలో ఎలాంటి ప్లాన్స్ వేసుకోలేదని చెప్పుకొచ్చాడు.…
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘మాస్ జాతర’ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి.. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. మొదటి గీతంగా విడుదలైన ‘తు మేరా లవర్’ అందరినీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు రెండవ గీతంగా ‘ఓలే…