Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రధాన సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించేలా కనిపిస్తోంది. పర్సంటేజ్ సిస్టమ్’ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా శుక్రవారం (మే 15, 2026) హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఛాంబర్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ మూడు వర్గాల సభ్యులతో అత్యవసరంగా ఒక జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎగ్జిబిటర్ల సెక్టార్కు సంబంధించిన పర్సంటేజీల విధానంపై లోతైన చర్చలు జరిగాయి. లాభనష్టాల పంపకాల విషయంలో ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఈ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ సున్నితమైన వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చే బాధ్యతను టాలీవుడ్ అగ్ర నిర్మాతలు తమ భుజాలపై వేసుకున్నారు. సమస్యను లోతుగా అధ్యయనం చేసి ఒక స్పష్టమైన నిర్ణయానికి రావడం కోసం ఫిల్మ్ ఛాంబర్ ఒక ప్రత్యేక ‘సబ్-కమిటీ’ని ఏర్పాటు చేసింది. ఛాంబర్ ప్రెసిడెంట్ డి. సురేష్ బాబు ఛైర్మన్గా వ్యవహరించనున్న ఈ కమిటీకి.. వెటరన్ ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, కె.ఎల్. నారాయణ, మాజీ అధ్యక్షుడు దిల్ రాజు, కె. అశోక్ కుమార్ కన్వీనర్లుగా బాధ్యతలు తీసుకున్నారు. వీరి పర్యవేక్షణలోనే కొత్త కమిటీ తమ కార్యాచరణను సాగించనుంది.
Also Read
- Casting Couch: 'బట్టలు విప్పమన్నారు'.. కాస్టింగ్ కౌచ్పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
- Toxic Effect: యశ్ 'టాక్సిక్' ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
- Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్... ఈరోజే 'హైవానియత్' టీజర్
- SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
ఈ పర్సంటేజీల పంచాయితీలో ఎవరి వాదనలు వారు స్పష్టంగా వినిపించే అవకాశం కల్పించేలా, మూడు రంగాల (నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు) నుంచి సమానంగా ఏడుగురు చొప్పున మొత్తం 21 మంది సభ్యులతో ఈ స్పెషల్ సబ్-కమిటీని నియమించారు.
నిర్మాతల మండలి నుంచి: వై. సురేందర్ రెడ్డి, వై. సుప్రియ, వై. రవిశంకర్, బి. బాపినీడు, చెరుకూరి సుధాకర్, ఎస్.కె.ఎన్ (SKN), టి. ప్రసన్న కుమార్.
ఎగ్జిబిటర్ల రంగం నుంచి: వి. ప్రతాప్ రెడ్డి, టి. బాలగోవింద్ రాజ్, కె. అనుపమ్ రెడ్డి, పి. శ్రీనివాసరావు, జి. వీరనారాయణ బాబు, కె. వంశీ కిషోర్ (చిన్ని), ఎం. విజేందర్ రెడ్డి.
డిస్ట్రిబ్యూటర్ల వర్గం నుంచి: డి. విష్ణుమూర్తి, వి. వీరనాయుడు, ఎన్. సుధాకర్ రెడ్డి, ముత్యాల రామదాసు, ఎన్. నాగార్జున, ఠాగూర్ మధు, ధీరజ్ మొగిలినేని. ఉన్నారు.
ఏర్పాటైన 21 మంది సభ్యుల కమిటీ ఈ పర్సంటేజీల చిక్కుముడిని ఎంత త్వరగా, ఎంత చాకచక్యంగా విప్పుతుందనే దానిపై యావత్ తెలుగు సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందరూ ఒకే తాటిపైకి వచ్చి తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!