టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్లో మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. ఇదిలావుంటే, ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట సినిమాలోని మహేష్ లుక్ తో చిన్నపాటి టీజర్ నే చిత్ర యూనిట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీంతో…
ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజికల్ వార్ ఎవరి మధ్య అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పేది దేవిశ్రీప్రసాద్, థమన్ పేర్లే. ఇద్దరూ గత కొంతకాలంగా బ్లాక్ బస్టర్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఏ స్టార్ సినిమా ఆరంభిస్తున్నా… మ్యూజిక్ గురించి ముందుగా సంప్రదించేది వీరిద్దరినే. మరి వీరిద్దరూ సినిమాకు ఎంత వసూలు చేస్తారనే విషయం చాలామందికి ఆసక్తి కలిగించే అంశం. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు దేవిశ్రీప్రసాద్ నాలుగు కోట్ల వరకూ ఛార్జ్ చేస్తారని, థమన్ 3…
నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’. వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ప్లిక్స్ లో స్ర్టీమ్ అవుతోంది. అయితే డిజిటల్ లో ఈ సినిమాకు చక్కటి రెస్పాన్స్ లభిస్తోందట. ఇదే విషయాన్ని నెట్ ఫ్లిక్స్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ‘వైల్డ్ డాగ్’కు తక్కువ టైమ్ లో రికార్డ్ వ్యూస్ వచ్చాయట. దక్షిణాది…
అడివి శేష్.. ‘క్షణం’, ‘గూఢచారి’ ‘ఎవరు’ వంటి సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందరి హీరోల్లా కాకుండా వినూత్నమైన సినిమాలను తీస్తూ వరుసగా విజయాలను సాధిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 26/11 ముంబై నగరంలో తాజ్ హోటల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను తాజ్ హోటల్లోనే చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేశారట.…
తమ తదుపరి చిత్రంగా మొదలయ్యేది ‘ఐకాన్’ అని స్పష్టం చేశాడు దిల్ రాజు. ‘వకీల్ సాబ్’ సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని చెబుతూ ‘వ్యక్తిగతంగా ఈ స్ర్కిప్ట్ కి బాగా కనెక్ట్ అయ్యాను. వేణుశ్రీరామ్ చెప్పిన లైన్ బాగా నచ్చింది. దానిని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా రెడీ చేశాం. ఇక మొదలు పెట్టడమే తరువాయి’ అంటున్నారు. అప్పటలో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను కొంచెం వెనక్కి జరపవలసి వచ్చిందని ఇప్పుడు ఇక…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పుష్ప’. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ బాషల్లో భారీ స్థాయిలో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. రశ్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, ధనుంజయ్ ముఖ్యపాత్రధారులు. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్…
చిరంజీవి ఆ మధ్య తనకు కరోనా వచ్చిందని, తనను కలిసిన వాళ్ళంతా పరీక్షలు చేయించుకోమని ప్రకటించారు. అయితే… ఎలాంటి అనారోగ్య లక్షణాలు రెండు మూడు రోజులైనా కనిపించకపోవడంతో ఆయన మళ్ళీ మరో రెండు చోట్ల టెస్టులు చేయించుకుంటే కరోనా సోకలేదని తెలిసింది. దాంతో తిరిగి ఈ విషయాన్ని జనానికి సోషల్ మీడియా మీద తెలియచేశారు. తాజాగా ఇలాంటి సంఘటనే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ విషయంలోనూ జరిగింది. సమంత నాయికగా ఆయన దాదాపు ఇరవై రోజులుగా ‘శాకుంతలం’ సినిమాను…
తెలుగమ్మాయి అంజలి ‘వకీల్ సాబ్’తో నిలదొక్కుకున్నట్లేనా!? గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో ఓ వేవ్ లా టాలీవుడ్ ని తాకింది అంజలి. అంతకు ముందు చిన్న చిన్న సినిమాల్లో నటించినా… ఆ సినిమా ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. అప్పటికే తమిళనాట కూడా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది అంజలి. అయితే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులతో కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించలేక పోయింది. మధ్యలో కొన్ని సినిమాల్లో మెరిసినా మునుపటి ఫామ్ అందిపుచ్చుకోలేక…