నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ‘జాతిరత్నాలు’ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించి ఘన విజయం సాధించింది. టాలీవుడ్ లో చిన్న సినిమాలకు మంచి ఊపు తెచ్చిన సినిమా ‘జాతిరత్నాలు’ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ తాజాగా బుల్లితెరపైనా విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఇటీవల ఈ సినిమా జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. సినిమా థియేటర్లలో ఎలా అయితే ఆడియన్స్ ను…
సినీ ఆర్టిస్ట్ ఏ.కృష్ణం అలియాస్ హీరో కృష్ణుడు అరెస్ట్ అయ్యారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్న కృష్ణుడును ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజుతో పాటు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి పేకాట స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు..ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. టాలీవుడ్ ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన కృష్ణుడు ‘వినాయకుడు’ సినిమాలో హీరోగా నటించాడు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో నలుగురు పోటీ పడుతుండటంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు ప్రకాశ్ రాజ్ ప్రెస్మీట్ పెట్టి తమ ప్యానల్ సభ్యులను వెల్లడించారు. ‘సెప్టెంబర్ 19 నాడు మా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరో ప్రెస్ మీట్ పెడతామని తెలిపారు. ఈ మీటింగ్ లో తన ప్యానెల్…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ముగిసింది. 7 గంటలు పాటు ఈడీ సుదీర్ఘంగా విచారణ చేసింది. బ్యాంక్ లావాదేవీలుపై ప్రశ్నించిన ఈడీ.. 30 ప్రశ్నలకు రకుల్ నుండి సమాచారం రాబట్టుకొంది. ఎప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన రావాలని రకుల్ కు అధికారులు తెలియజేశారు. కెల్విన్ తో సంబందాలు, ఎఫ్ క్లబ్ లో పార్టీపై ఆరా తీశారు. కాగా, రియా చక్రవర్తితో ఫ్రెండ్షిప్ పై ఈడీ అధికారులు విచారణలో అడిగి తెలుసుకున్నారు.…
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ తర్వాత పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. నిజానికి కరోనా ఫస్ట్ వేవ్ తగ్గగానే ఫస్ట్ తన సినిమా ‘సూపర్ మచ్చి’నే కళ్యాణ్ దేవ్ సెట్స్ మీదకు తీసుకెళ్ళాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విడుదలకు సిద్ధంగా ఉంది. మధ్యలో దీనిని ఓటీటీలో విడుదల చేస్తారనే వార్తలూ వచ్చాయి. అలానే ‘కిన్నెరసాని’ సినిమా కూడా కళ్యాణ్ దేవ్ చేస్తున్నాడు. దీనిని ‘అశ్వద్ధామ’ ఫేమ్…
డ్రగ్ అనేది ఒక్క సెలెబ్రెటీ ఇస్యు మాత్రమే కాదని, పొలిటికల్- బార్డర్- ఆర్థికపరమైన ఇష్యూ కూడా అని నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టాలీవుడ్ డ్రగ్ కేసు ఇష్యూపై త్వరలో మాట్లాడుతాను.. నా వ్యక్తిగత అనుభవం తెలియజేస్తాను’ అంటూ పూనమ్ కౌర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలకు కొందరి అభిమానులు మద్దతు తెలియపరుస్తున్నారు. వ్యవస్థలోని లోపం పూనమ్ ఎత్తిచూపిందంటున్నారు. సినీ సెలెబ్రెటీలను నాలుగు రోజులు విచారణ జరిగి ఆతరువాత ‘యథా రాజా.. తథా…
సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వరుసగా ఆయన నటిస్తున్న సినిమాల అప్డేట్స్ వచ్చాయి.. అభిమానుల ట్వీట్స్ తో ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ మోత మోగింది. మొదట ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రాగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకొంటుంది. ఆ తరువాత ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల తేదీని మాత్రమే ప్రకటించిన.. ఫ్యాన్స్ సంతృప్తిగానే ఉన్నారు. ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న సినిమా…
హీరో ఆది పినిశెట్టి అథ్లెట్గా నటిస్తోన్న చిత్రం ‘క్లాప్’. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజీ, ఎం. రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్ ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఆది పినిశెట్టి పెద్ద పోటీ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పోస్టర్లో ఆది స్ప్రింటర్గా కనిపిస్తున్నారు. పారా ఒలింపిక్స్ లో భారతదేశం మంచి…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి ఛార్మి విచారణ ముగిసింది. ఉదయం 10.30 నుండి సాయంత్రం 6.30 వరకు ఛార్మి ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈడీ అధికారులు కోరిన బ్యాంక్ డ్యాక్యుమెంట్స్ సమర్పించాను.. దర్యాప్తుకు పూర్తిగా సహకరించాను. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తిరిగి ఎప్పుడు పిలిచినా దర్యాప్తుకు సహకరిస్తాను’ అంటూ ఛార్మి తెలిపింది. కాగా విచారణ సందర్భంగా ఆమెకు సంబంధించిన రెండు బ్యాంక్ ఖాతాల లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు. 2016లో కెల్విన్తో మాట్లాడిన…