టీటీడీ అధికారులుతో వరుస సమావేశాలు నిర్వహించారు ఈవో జవహర్ రెడ్డి. అయితే విపత్తు సమయంలో భక్తులకు ముందస్తు సూచనలు చేసేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చెయ్యాలి అని జవహర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ మధ్యే తిరుపతిలో వచ్చిన వరదల గురించి అందరికి తెలిసిందే. ఆ వరదల వల్ల భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇక ఈ వరదల్లో పాడైన ఘాట్ రోడ్లు ,శ్రీవారి మెట్టు నడకమార్గంలో మరమత్తు పనులు వేగవంతంగా నిర్వహించాలి…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు క్యూ కడతారు.. ప్రస్తుతం వర్షాలతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. స్వామి వారి దర్శనానికి భక్తులు తరలివస్తూనే ఉన్నారు.. ఇక, కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో శ్రీవారి దర్శనానికి నోచుకోని భక్తులు ఇప్పుడు క్రమంగా తిరుమలకు వెళ్తున్నారు.. నవంబర్ నెల ముగుస్తుండడంతో.. డిసెంబర్ నెల టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది టీటీడీ.. Read Also: ఏపీ వరి ధాన్యానికి బ్రేక్లు..! సరిహద్దులో అడ్డుకున్న తెలంగాణ అధికారులు..…
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి గురించి ప్రసార మాధ్యమాల్లో వచ్చే కార్యక్రమాలకు, ప్రత్యక్ష ప్రసారాలకు ఎంతో ప్రాధాన్యత వుంటుంది. అయితే శ్రీవారి వైభవాన్ని చాటిచెప్పేలా ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం చేస్తూన్న సుప్రభాత సేవ కైంకర్యాల ప్రత్యక్షప్రసారాలను ఎందుకు నిలిపివేసారు అని నిలదీశారు బిజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఏడాది ముందుగానే అగ్రిమెంట్ ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలన్నారు. ఆల్ ఇండియా రేడియా యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న శ్రీవారి భక్తులు స్వామివారి పూజా…
నిన్న తిరుమల శ్రీవారిని 18941 మంది భక్తులు దర్శించుకున్నారు. 8702 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే నిన్న హుండి ఆదాయం 1.49 కోట్లు గ ఉంది. అయితే ఇవాళ వరహస్వామి ఆలయంలో మహసంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. 14 కోట్ల రూపాయల వ్యయంతో వరహస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేయనున్నారు. రేపటి నుంచి ఐదు రోజులు పాటు సంప్రోక్షన కార్యక్రమాన్ని వైధికంగా నిర్వహించనున్నారు అర్చకులు. ఇక ఇదిలా ఉంటె భారీ వర్షాలతో తిరుమలలో వరదలు…
తిరుమల శ్రీవారిని నగరి ఎమ్మెల్యే రోజా ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె మాట్లాడారు. రాజకీయలబ్ది కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు అని రోజా తెలిపారు. చంద్రబాబు డ్రామాలు ప్రజలు నమ్మరని. చంద్రబాబు హుందాగా వుంటూ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని ఆమె హితవు పలికారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా నూతనంగా రాజధాని బిల్లు త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడతాం అని రోజా అన్నారు. అయితే తిరుమలలో ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చిన విషయం…
తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దాంతో టీటీడీ దర్శనాలు నిలిపివేసింది. అయితే ఈ వర్షాలతో టీటీడీ కి 4 కోట్లకు పైగా నష్టం వచ్చింది అని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. మొదటి ఘాట్ రోడ్డులో ఐదు ప్రాంతాలలో కోండ చరియలు విరిగిపడ్డాయి. రెండవ ఘాట్ రోడ్డులో 13 ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా…ఐదు ప్రాంతాలలో రక్షణ గోడ దెబ్బతింది అని అన్నారు. అలాగే నారాయణగిరి అతిథి గృహం వద్ద కోండచరియలు విరిగిపడడంతో మూడు గదులు…
ఏపీలో ముఖ్యంగా తిరుపతిలో గ్రామాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అయితే తాజాగా రాయల్ చెరువు నిండిపోవడంతో 7 గ్రామాలు ముంపుకు గురైయ్యాయి. చెరువుకు వున్న మొరవ ఆక్రమణకు గురైవడంతో గ్రామాలు ముంపుకు గురైవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు గ్రామస్థులు. ఈ వరదలతో 7 గ్రామ ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంభంధాలు తెగిపోయాయి. ఆహారం కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు గ్రామస్థులు. తమ గ్రామాలు వైపు అధికారులు కన్నేత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు గ్రామస్థులు. అయితే ఏపీలో…
భారీవర్షాలు ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అల్లాడిపోతోంది. ఏ ప్రాంతం చూసినా నీటిలోనే వుంది. కాలనీలు మూడు నాలుగు అడుగుల నీటిలోనే వుండిపోయాయి. దీంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మీపురం వరద నీటిలో కొట్టుమిట్టాడుతోంది. తిరుపతిలో నిండు కుండలా మారింది రాయల్ చెరువు. ముంపునకు గురయ్యాయి. కాలేపల్లి, సూరాళ్లపల్లి, రాయల్ చెరువు పేట,చిట్టతూరు చెరువులు. ప్రధానంా రాయల్ చెరువు నిండుగా వుండడంతో నాలుగు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇన్ ఫ్లో…
తిరుపతిలో నిన్న కొద్దిగా శాంతించిన వరణుడు ఈరోజు తిరిగి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి తిరుమల, తిరుపతిలో భారీగా వర్షం కురుస్తోంది. ఈ వర్షాల ధాటికి మళ్లి చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే తిరుపతి నగరంలో ఎటు చూసినా నీరు తప్పించి మరేమి కనిపించడంలేదు. Read: ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత… అటు తిరుమలకు వెళ్లే మెట్ల మార్గం, రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. శ్రీవారి మెట్టు మార్గం…
తిరుపతి జలదిగ్భందంలో చిక్కుకుంది. రోడ్లు కాలువల్లా మారాయి. కాలనీలు కుంటలను తలపిస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా వరదే..! రెండు రోజులుగా వరద నీటిలోనే మగ్గుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు. తిరుపతి అతలాకుతలమైంది. కొండ పైనుంచి వచ్చిన వరద ప్రవాహం తిరుపతిని ముంచేసింది. జడివాన దెబ్బకు చిగురుటాకులా వణికిపోయింది.ఇప్పటికీ నలువైపులనుంచి వరద వస్తూనే ఉంది. మోకాలి లోతు నీటిలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.కాలువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి కాలువలు సరిపోవడం లేదు. దాంతో ఉప్పొంగిపారుతున్నాయి. తిరుపతి పట్టణంలోని…