శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కొత్త సంవత్సరం రోజు సిఫార్సు లేఖలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 31వ తేదీన ఫుల్గా ఎంజాయ్ చేసి.. మరునాడు.. అంటే జనవరి 1వ తేదీన గుడి ముందు బారులు తీరుతుంటారు.. తెలుగు సంవత్సరంగా చూస్తే.. జనవరి 1వ తేదీకి ప్రాధాన్యత లేకపోయినా.. ఆంగ్ల క్యాలెండర్లోని జనవరి 1న మాత్రం ఆలయాలకు భక్తులకు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుంటారు.. ఇక, వారికి కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.. శనివారం రోజు నూతన సంవత్సరం సందర్భంగా సిఫార్సు లేఖలు స్వీకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. జనవరి 1తో పాటు జనవరి 13 నుండి 22వ తేదీ వరకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.. అయితే, స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. భక్తులు కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ స్పష్టం చేసింది..
Read Also: డిసెంబర్ 31, శుక్రవారం దినఫలాలు
Also Read
మరోవైపు.. జనవరి 11 నుండి 14వ తేదీ వరకు వసతి గదుల ఆడ్వాన్స్ రిజర్వేషన్ను రద్దు చేసింది టీటీడీ.. శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేస్తూ తిరుమలలోని అన్ని గదులను కరెంటు బుకింగ్ ద్వారా కేటాయించాలని నిర్ణయించింది.. జనవరి 11 నుండి 14వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు. ఇక, వరుసగా రెండో సంవత్సరం కూడా శ్రీవారి దర్శనాలు, హుండీ ఆదాయంపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది.. ఈ ఏడాది శ్రీవారిని కోటి నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని.. హుండీ ద్వారా శ్రీవారికి రూ.826 కోట్లు ఆదాయం సమకూరినట్టు టీటీడీ ప్రకటించింది.. ఇక, ఈ ఏడాది కూడా టీటీడీ బడ్జెట్ అంచనాలు తప్పాయి.. అయితే, ఈ ఏడాది హుండీ ద్వారా 1,100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసింది టీటీడీ.. కానీ, అది రూ.826 కోట్లకే పరిమితం అయ్యింది.. కరోనా ఎఫెక్ట్తో శ్రీవారిని దర్శించుకునే భక్తులపై ఆంక్షలు విధించడం.. ఆ తర్వాత క్రమంగా అనుమతి ఇచ్చినా.. సాధారణ పరిస్థితులు లేకపోవడంతో.. ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!