శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కొత్త సంవత్సరం రోజు సిఫార్సు లేఖలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 31వ తేదీన ఫుల్గా ఎంజాయ్ చేసి.. మరునాడు.. అంటే జనవరి 1వ తేదీన గుడి ముందు బారులు తీరుతుంటారు.. తెలుగు సంవత్సరంగా చూస్తే.. జనవరి 1వ తేదీకి ప్రాధాన్యత లేకపోయినా.. ఆంగ్ల క్యాలెండర్లోని జనవరి 1న మాత్రం ఆలయాలకు భక్తులకు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుంటారు.. ఇక, వారికి కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.. శనివారం రోజు నూతన సంవత్సరం సందర్భంగా సిఫార్సు లేఖలు స్వీకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. జనవరి 1తో పాటు జనవరి 13 నుండి 22వ తేదీ వరకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.. అయితే, స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. భక్తులు కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ స్పష్టం చేసింది..
Read Also: డిసెంబర్ 31, శుక్రవారం దినఫలాలు
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
మరోవైపు.. జనవరి 11 నుండి 14వ తేదీ వరకు వసతి గదుల ఆడ్వాన్స్ రిజర్వేషన్ను రద్దు చేసింది టీటీడీ.. శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేస్తూ తిరుమలలోని అన్ని గదులను కరెంటు బుకింగ్ ద్వారా కేటాయించాలని నిర్ణయించింది.. జనవరి 11 నుండి 14వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు. ఇక, వరుసగా రెండో సంవత్సరం కూడా శ్రీవారి దర్శనాలు, హుండీ ఆదాయంపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది.. ఈ ఏడాది శ్రీవారిని కోటి నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని.. హుండీ ద్వారా శ్రీవారికి రూ.826 కోట్లు ఆదాయం సమకూరినట్టు టీటీడీ ప్రకటించింది.. ఇక, ఈ ఏడాది కూడా టీటీడీ బడ్జెట్ అంచనాలు తప్పాయి.. అయితే, ఈ ఏడాది హుండీ ద్వారా 1,100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసింది టీటీడీ.. కానీ, అది రూ.826 కోట్లకే పరిమితం అయ్యింది.. కరోనా ఎఫెక్ట్తో శ్రీవారిని దర్శించుకునే భక్తులపై ఆంక్షలు విధించడం.. ఆ తర్వాత క్రమంగా అనుమతి ఇచ్చినా.. సాధారణ పరిస్థితులు లేకపోవడంతో.. ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!