త్వరలో వకుళా మాత ఆలయం ప్రారంభం.. మంత్రి పెద్దిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దశాబ్దాల నాటి భక్తుల కల త్వరలో నెరవేరబోతోంది. ఏళ్ళ తరబడి శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయం శరవేగంగా పునర్నిర్మాణమవుతోంది.తిరుపతిలోని వకుళామత దేవాలయం పనులని పరిశీలించారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. త్వరలో జరిగే వకుళామత దేవాలయం ప్రారంభానికి సీఎం వైఎస్ జగన్ హాజరవుతారని మంత్రి అన్నారు. భారీ వర్షాల కారణంగా పేరూరు చెరువులో నీరు నిండి పనులు ఆగాయన్నారు. ఇప్పుడే పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, కోనేరు పని పూర్తి చేసి, గార్డెనింగ్ తో పాటు మిగిలిన పరిసరాలు సుందరికరిస్తాం అన్నారు. ఇప్పటికే దేవాలయంలో పనులు అన్నీ పూర్తి చేశామన్నారు. కోనేరు, మిగిలిన పనులు పూర్తయ్యాక దేవాలయం భక్తులకి అందుబాటులోకి తెస్తాం అన్నారు. తిరుమలకు అన్నమయ్య మూడో మార్గం అవసరం ఉందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఎన్ని దారులైనా శ్రీవారి చెంతకు మాత్రమే చేరుతాయి అన్నారు.
వకుళామాత ఆలయానికి మంచి రోజులు
తిరుపతి రూరల్ పాతకాల్వ సమీపంలోని పేరూరు బండపై ఉన్న వకుళామాత ఆలయం వందేళ్లకు పైగా చరిత్ర కలిగి వుంది. తర్వాత ఆలయం వున్న సంగతి ఎవరికీ తెలీదు. పేరూరు బండపై కాశిరాళ్లతో శిథిలమైన ఓ ఆలయం దర్శనమిచ్చేది. విగ్రహం ధ్వంసం కావడంతో దీన్ని తీసుకెళ్లి కాలువలో పడేశారని స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలోని వకుళామాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి గంట మోగించిన తర్వాతే తిరుమలలో వేంకటేశ్వర స్వామివారికి నైవేద్యం సమర్పించేవారు. అంతటి విశిష్టత వున్న ఆలయం ఏళ్ళ తరబడి జీర్ణోద్ధరణకు నోచుకోలేదు.
Also Read
2010లో కొందరు భక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఆలయాన్ని పునఃనిర్మించాలని 2015లో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆలయానికి 4.5 ఎకరాలు కేటాయిస్తూ బఫర్ జోన్ ఏర్పాటు చేశారు. టీటీడీకి ఆ స్థలాన్ని అప్పగించారు. ఇనుప కంచె ఏర్పాటుచేశారు. 2017లో పరిపూర్ణానంద స్వామి ద్వారా భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవ తీసుకుని ఆలయ పనులు వేగవంతం చేశారు.పూర్వపు ఆలయ నిర్మాణాన్ని కదపలేదు. పురాతన రాతికట్టడం మీదనే నిర్మాణం పూర్తిచేశారు. ఆలయం ముఖద్వారం వద్ద గాలిగోపురం వుంది. గర్భగుడికి శిఖరం ఏర్పాటు చేసి, రాగితాపడం పనులు పూర్తిచేశారు. రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయం పూర్తయి ప్రారంభమైతే పరిసర ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!