TTD: తిరుమలలో ఇవాళే గరుడ సేవ.. భక్తులకు కీలక సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోవ రోజు శ్రీవారు ఉదయం మోహిని అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు.. ఇక, బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ సేవ ఈ రోజే జరగనుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. ఇవాళ తిరుమలకు రానున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లలిత్.. శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొననున్నారు.. ఈ వాహన సేవకు వచ్చే భక్తులందరికి దర్శనభాగ్యం కల్పించేందుకు పటిష్టచర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం.. భక్తులందరికీ వాహన దర్శనం కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాటు చేసినట్లు చేసింది.. తిరు మాడ వీధుల్లో హారతి పాయింట్లు, గ్యాలరీలను ఈవో, డీఐజి రవి ప్రకాష్, జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డితో కలిసి ఇప్పటికే పరిశీలించారు.. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది భక్తులకు శ్రీవారి గరుడ వాహన దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఇక, ఈ ఏడాది సౌత్ వెస్ట్ గేటు, నార్త్ వెస్ట్ గేటు, నార్త్ ఈస్ట్ గెట్ల వద్ద ఉన్న హారతి పాయింట్లలో హారతులకు బదులు భక్తులను స్వామి వారి వాహన సేవకు అనుమతించనుంది టీటీడీ.
Read Also: APPSC Notification: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
Also Read
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
గరుడ సేవ కారణంగా ట్రాఫిక్ నియంత్రణా చర్యలు చేపట్టారు టీటీడీ అధికారులు. ఘాట్ రోడ్లలో రేపు మధ్యహ్నం వరకు ద్విచక్రవాహనాలు నిలిపివేస్తూ నిర్ణం తీసుకున్నారు.. నిన్నటి నుంచి అంటే సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరుమలకు బైక్లు నిషేధించారు. అలాగే వాహనదారులు అంతా తిరుపతిలో నిర్దేశించిన అలిపిరి బస్ స్టాండ్ పాత చెక్ పెయింట్ ఇస్కాన్ గ్రౌండ్, మెడికల్ కాలేజి గ్రౌండ్, నెహ్రు మున్సిపల్ గ్రౌండ్లలో పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇవాళ తిరుమలకు వెళ్లే వాహనాలు ముందుగా ప్రీ పాసులు పోందాలని సూచించారు పోలీసులు.. తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ గరుడవాహన దర్శనభాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. గ్యాలరీల ద్వారా 2 లక్షల మంది భక్తులుకు.. హారతి పాయింట్ల వద్ద హరతులు రద్దు చేసి.. భక్తులును దర్శనానికి అనుమతించడం ద్వారా మరో 30 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలగనుంది.. ఇక, శ్రీవారి ఆలయం ఎదుట గ్యాలరీల రీఫిల్లింగ్ ద్వారా మరో 25 వేల మంది భక్తులకు స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించే ఏర్పాట్లు చేసింది టీటీడీ.
తాజావార్తలు
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..