Tirumala: తిరుమల భక్తులకు గమనిక.. బ్రహ్మోత్సవాలకు వాటిని తీసుకురావొద్దు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుమల చేరుకునే భక్తులకు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి కీలక సూచనలు చేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 4వేల మంది సిబ్బందితో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2వేల మంది పోలీసులు అదనంగా గరుడ సేవ కోసం సేవలు అందిస్తారని.. మొత్తం 6వేల మంది పోలీసులు బ్రహ్మోత్సవాలలో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 27న తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని.. ఈనెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. తొలిరోజు పర్యటనలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి.. మరుసటి రోజు తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మను సీఎం జగన్ దర్శించుకుంటారని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి వివరించారు.
Read Also:Russia-Ukraine War: రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు.. రూ.35వేల కోట్లు ఆదా చేసిన భారత్
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
అటు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్లలో మాత్రమే సేవా టిక్కెట్లు కొనుగోలు చేయాలని.. దళారులను నమ్మి మోసపోవద్దని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి సూచించారు. తిరుమలలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా 400 మంది పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. తిరుమలలో 38 పార్కింగ్ స్థలాలు గుర్తించామని.. తిరుపతిలో పది వేల వాహనాలు అదనంగా పార్క్ చేసే విధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమల మాఢవీధులలో గ్యాలరీ కెపాసిటీ లక్ష 80 వేల మంది వరకు ఉందని.. గరుడ వాహన సేవ రోజు 3-4 లక్షలు మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఈనెల 30 నుంచి అక్టోబర్ 2 వరకు వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదన్నారు. తిరుమలలో 2800 సీసీ కెమెరాలు, తిరుపతిలో 1300 సీసీ కెమెరాల్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. తిరుమలకు బ్రహ్మోత్సవాల సందర్భంగా తరలివచ్చే భక్తులు విలువైన వస్తువులు తీసుకు రావొద్దని ఎస్పీ పరమేశ్వరరెడ్డి సూచించారు. చిన్నారులకు, వృద్ధులకు జియో ట్యాగింగ్ అందుబాటులో ఉంచుతామన్నారు. బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో తిరుపతిలో చెక్ పోస్టుల ఏర్పాటు, వాహన తనిఖీలు ఉంటాయన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!