Tirumala: తిరుమల భక్తులకు గమనిక.. బ్రహ్మోత్సవాలకు వాటిని తీసుకురావొద్దు..!!
Tirumala: ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుమల చేరుకునే భక్తులకు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి కీలక సూచనలు చేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 4వేల మంది సిబ్బందితో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2వేల మంది పోలీసులు అదనంగా గరుడ సేవ కోసం సేవలు అందిస్తారని.. మొత్తం 6వేల మంది పోలీసులు బ్రహ్మోత్సవాలలో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 27న తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని.. ఈనెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. తొలిరోజు పర్యటనలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి.. మరుసటి రోజు తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మను సీఎం జగన్ దర్శించుకుంటారని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి వివరించారు.
Read Also:Russia-Ukraine War: రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు.. రూ.35వేల కోట్లు ఆదా చేసిన భారత్
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
అటు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్లలో మాత్రమే సేవా టిక్కెట్లు కొనుగోలు చేయాలని.. దళారులను నమ్మి మోసపోవద్దని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి సూచించారు. తిరుమలలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా 400 మంది పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. తిరుమలలో 38 పార్కింగ్ స్థలాలు గుర్తించామని.. తిరుపతిలో పది వేల వాహనాలు అదనంగా పార్క్ చేసే విధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమల మాఢవీధులలో గ్యాలరీ కెపాసిటీ లక్ష 80 వేల మంది వరకు ఉందని.. గరుడ వాహన సేవ రోజు 3-4 లక్షలు మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఈనెల 30 నుంచి అక్టోబర్ 2 వరకు వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదన్నారు. తిరుమలలో 2800 సీసీ కెమెరాలు, తిరుపతిలో 1300 సీసీ కెమెరాల్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. తిరుమలకు బ్రహ్మోత్సవాల సందర్భంగా తరలివచ్చే భక్తులు విలువైన వస్తువులు తీసుకు రావొద్దని ఎస్పీ పరమేశ్వరరెడ్డి సూచించారు. చిన్నారులకు, వృద్ధులకు జియో ట్యాగింగ్ అందుబాటులో ఉంచుతామన్నారు. బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో తిరుపతిలో చెక్ పోస్టుల ఏర్పాటు, వాహన తనిఖీలు ఉంటాయన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో