Tirumala Brahmotsavalu Security: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
తిరుమల ఏడుకొండలు బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 26వ తేదీన అంకురార్పణ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు మాఢ వీధులలో విహరించనున్నారు శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు..27వ తేదీ సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలు..27వ తేదీ రాత్రి శ్రీవారికి పట్టు వస్ర్తాలను సమర్పించనున్నారు సీఎం జగన్. దీంతో భద్రతా ఏర్పాట్ల విషయంలో అప్రమత్తంగా వున్నారు టీటీడీ భద్రతా అధికారులు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ CVSO నరసింహ కిషోర్ తెలిపారు.
Read Also: Srisailam Brahmotsavalu: దసరా బ్రహ్మోత్సవాలకు ముక్కంటి క్షేత్రం ముస్తాబు
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
5 వేల మంది పోలీసులతో బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గ్యాలరీలోకి భక్తులు సులభతరంగా చేరుకోవడానికి ప్రత్యేకంగా క్యూ లైనులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హారతి పాయింట్ల వద్ద కూడా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరుమలలో 15 వేల వాహనాలు మాత్రమే పార్కింగ్ చేసుకునే వెసులుబాటు వుందన్నారు.
తిరుపతిలో కూడా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసాం. వీఐపీల నుంచి సామాన్య భక్తులు వరకు టీటీడీ నిబంధనలు పాటించాలన్నారు. మరోవైపు ఇవాళ ఆన్ లైన్ లో అక్టోబర్ మాసానికి సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనుంది టీటీడీ.. బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబర్ 1 నుంచి 5వ తేది మినహాయించి మిగిలిన తేదీలకు టోకెన్లు విడుదల చెయ్యనుంది టీటీడీ..ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు.
రూ.100 కోట్ల వ్యయంతో యాత్రికుల వసతి సముదాయం, రూ.33 కోట్ల వ్యయంతో అదనపు క్యూ లైన్లు నిర్మాణానికి ఆమోదం తెలపనుంది పాలకమండలి. తిరుమలలో ఇవాళ 15 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు…సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది..నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 74,817 గా వుంది. తలనీలాలు సమర్పించిన వారు 33,350 మంది భక్తులు…హుండీ ఆదాయం రూ.2.97 కోట్లుగా టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాబోయే రోజులలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం వుంది.
Read Also: Nanamuri Balakrishna: బాహుబలి రేంజ్ సినిమా.. ఎందుకు ఆగిపోయింది?
తాజావార్తలు
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!