Tirumala Brahmotsavalu Security: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల ఏడుకొండలు బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 26వ తేదీన అంకురార్పణ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు మాఢ వీధులలో విహరించనున్నారు శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు..27వ తేదీ సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలు..27వ తేదీ రాత్రి శ్రీవారికి పట్టు వస్ర్తాలను సమర్పించనున్నారు సీఎం జగన్. దీంతో భద్రతా ఏర్పాట్ల విషయంలో అప్రమత్తంగా వున్నారు టీటీడీ భద్రతా అధికారులు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ CVSO నరసింహ కిషోర్ తెలిపారు.
Read Also: Srisailam Brahmotsavalu: దసరా బ్రహ్మోత్సవాలకు ముక్కంటి క్షేత్రం ముస్తాబు
Also Read
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
5 వేల మంది పోలీసులతో బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గ్యాలరీలోకి భక్తులు సులభతరంగా చేరుకోవడానికి ప్రత్యేకంగా క్యూ లైనులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హారతి పాయింట్ల వద్ద కూడా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరుమలలో 15 వేల వాహనాలు మాత్రమే పార్కింగ్ చేసుకునే వెసులుబాటు వుందన్నారు.
తిరుపతిలో కూడా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసాం. వీఐపీల నుంచి సామాన్య భక్తులు వరకు టీటీడీ నిబంధనలు పాటించాలన్నారు. మరోవైపు ఇవాళ ఆన్ లైన్ లో అక్టోబర్ మాసానికి సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనుంది టీటీడీ.. బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబర్ 1 నుంచి 5వ తేది మినహాయించి మిగిలిన తేదీలకు టోకెన్లు విడుదల చెయ్యనుంది టీటీడీ..ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు.
రూ.100 కోట్ల వ్యయంతో యాత్రికుల వసతి సముదాయం, రూ.33 కోట్ల వ్యయంతో అదనపు క్యూ లైన్లు నిర్మాణానికి ఆమోదం తెలపనుంది పాలకమండలి. తిరుమలలో ఇవాళ 15 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు…సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది..నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 74,817 గా వుంది. తలనీలాలు సమర్పించిన వారు 33,350 మంది భక్తులు…హుండీ ఆదాయం రూ.2.97 కోట్లుగా టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాబోయే రోజులలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం వుంది.
Read Also: Nanamuri Balakrishna: బాహుబలి రేంజ్ సినిమా.. ఎందుకు ఆగిపోయింది?
తాజావార్తలు
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!