Tirumala Brahmotsavalu Security: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల ఏడుకొండలు బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 26వ తేదీన అంకురార్పణ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు మాఢ వీధులలో విహరించనున్నారు శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు..27వ తేదీ సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలు..27వ తేదీ రాత్రి శ్రీవారికి పట్టు వస్ర్తాలను సమర్పించనున్నారు సీఎం జగన్. దీంతో భద్రతా ఏర్పాట్ల విషయంలో అప్రమత్తంగా వున్నారు టీటీడీ భద్రతా అధికారులు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ CVSO నరసింహ కిషోర్ తెలిపారు.
Read Also: Srisailam Brahmotsavalu: దసరా బ్రహ్మోత్సవాలకు ముక్కంటి క్షేత్రం ముస్తాబు
Also Read
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
5 వేల మంది పోలీసులతో బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గ్యాలరీలోకి భక్తులు సులభతరంగా చేరుకోవడానికి ప్రత్యేకంగా క్యూ లైనులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హారతి పాయింట్ల వద్ద కూడా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరుమలలో 15 వేల వాహనాలు మాత్రమే పార్కింగ్ చేసుకునే వెసులుబాటు వుందన్నారు.
తిరుపతిలో కూడా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసాం. వీఐపీల నుంచి సామాన్య భక్తులు వరకు టీటీడీ నిబంధనలు పాటించాలన్నారు. మరోవైపు ఇవాళ ఆన్ లైన్ లో అక్టోబర్ మాసానికి సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనుంది టీటీడీ.. బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబర్ 1 నుంచి 5వ తేది మినహాయించి మిగిలిన తేదీలకు టోకెన్లు విడుదల చెయ్యనుంది టీటీడీ..ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు.
రూ.100 కోట్ల వ్యయంతో యాత్రికుల వసతి సముదాయం, రూ.33 కోట్ల వ్యయంతో అదనపు క్యూ లైన్లు నిర్మాణానికి ఆమోదం తెలపనుంది పాలకమండలి. తిరుమలలో ఇవాళ 15 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు…సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది..నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 74,817 గా వుంది. తలనీలాలు సమర్పించిన వారు 33,350 మంది భక్తులు…హుండీ ఆదాయం రూ.2.97 కోట్లుగా టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాబోయే రోజులలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం వుంది.
Read Also: Nanamuri Balakrishna: బాహుబలి రేంజ్ సినిమా.. ఎందుకు ఆగిపోయింది?
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!