Home
Ticket Rates Issue
Ticket Rates Issue News
-
Chiranjeevi: 42 శాతం టాక్స్ కడుతున్నాం.. ప్రభుత్వాన్ని తిరిగి అడిగితే తప్పేంటీ..?
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో “చిరంజీవి సినిమా అంటేనే అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయి. అలాంటప్పుడు ‘ఆచార్య’కి టికెట్ రేటు పెంచవలసినన అవసరం ఉందా?’ అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు… -
Prakash Raj: మీ కక్ష ఏమైనా ఉంటే రాజకీయాల్లో చూసుకోండి.. బాక్సాఫీస్ దగ్గర ఎందుకు?
సృజన, సాంకేతికత మేళవించిన సినిమా రంగం పై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి అంటూ నటుడు ప్రకాష్ రాజ్ సూటిగా ప్రశ్నించారు. తాజాగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబడుతున్న విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా విడుదల సమయంలో ఏపీ థియేటర్స్ వద్ద తీవ్ర అడ్డంకి ఏర్పడింది. అంతకు ముందున్న రేట్లనే అమ్మాలని సినిమాపై ఆంక్షలు విధించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న… -
టికెట్ ధరల అంశంపై సమయం కోరిన సర్కార్
ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంపై ఇంకా ఎటూ తేలలేదు. పేదలకు సహాయం చేయడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తమ పనిని సమర్థించుకుంటుంటే, పలువురు సినీ ప్రముఖులు మాత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమ పట్ల, ఎగ్జిబిషన్ రంగం పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సినిమా పెద్దలు కోర్టుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా టికెట్ ధరల నియంత్రణను సవాలు చేస్తూ… -
సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయ కమిటీ తొలి భేటీ పూర్తి!
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి భేటి శుక్రవారం జరిగింది. హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షతన శుక్రవారం జరిగిన వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్న సభ్యులు సినిమా టిక్కెట్ల ధరలు, థియేటర్లలోని మౌలిక వసతులు, ప్రేక్షకుల స్పందనపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. కమిటీలోని సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్న ఛైర్మన్ జనవరి రెండోవారంలో ప్రత్యక్షంగా సభ్యులందరితోనూ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాలను… -
ఏపీ మూవీ లవర్స్ కు షాక్… 175 థియేటర్లు మూసివేత
ఏపీలో వరుసగా థియేటర్లు మూత పడుతున్నాయి. గత వారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 థియేటర్లు మూతపడ్డాయి. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరలను తగ్గించడంతో ఎగ్జిబిటర్లు వ్యాపారంలో నిలబడేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. శ్యామ్ సింగ రాయ్, పుష్ప, అఖండ చిత్రాల ప్రదర్శనకు ఆంధ్రాలో తాజా పరిణామాలతో అంతరాయం ఏర్పడింది. కొన్ని థియేటర్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేసి సీజ్ చేస్తున్నారు. మరోవైపు చాలామంది థియేటర్ యజమానులు తక్కువ టికెట్ ధరలతో సినిమా హాళ్లను నడపలేము అంటూ… -
చిరు, విజయ్ ట్వీట్స్… తెలంగాణకు మోదం… ఏపీకి ఖేదం
మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ శనివారం చేసిన ట్వీట్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. వీరు తమ తమ ట్వీట్స్ తో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అటు ఎపి గవర్నమెంట్ కు సందేశాలను పంపగలిగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో పెద్ద రగడ జరుగుతోంది. జీవో 35ను అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తే… కొంత మంది ఎగ్జిబిటర్స్ కోర్టుకు వెళ్ళి సింగిల్ జడ్జ్ తీర్పుతో దానిపై స్టే తీసుకు వచ్చారు. అయితే… -
సినిమా టికెట్ ధరల పెంపుపై విజయ్ దేవరకొండ హర్షం
తెలంగాణాలో సినిమా టికెట్ ధరల పెంపుపై స్టార్ హీరోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఉదయం చిరంజీవి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని, రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం నూటికి… -
చిత్తూరులో మూతపడ్డ 17 థియేటర్లు
ఏపీలో టికెట్ రేట్ల విషయంపై వివాదం కొనసాగుతోంది. డిస్ట్రిబ్యూటర్ల ఆవేదనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని పట్టుబట్టింది. దీంతో ఇప్పటికే పలువురు థియేటర్ యాజమాన్యాలు నష్టాల్లో సినిమాలను ప్రదర్శించలేక స్వచ్చందంగా థియేటర్లను క్లోజ్ చేసేసుకున్నారు. మరోవైపు థియేటర్లపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ తనిఖీల్లో చిత్తూరు జిల్లాలో 17 సినిమా థియేటర్లు మూత పడ్డట్లు సమాచారం. మదనపల్లి, కుప్పం, పలమనేరు పుంగనూరులలో నిన్న మధ్యాహ్నం నుంచే షో లు రద్దు… -
‘పుష్ప’రాజ్ కు షాక్… ఏపీ టికెట్ల వ్యవహారంలో ట్విస్ట్
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించాలంటూ ప్రత్యేక జీవోను తెరపైకి తీసుకురావడం, దానిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకు ఎక్కారు. దాంతో కోర్టు ప్రభుత్వ జీవోను రద్దు చేస్తూ టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే ఏపీ గవర్నమెంట్ ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. గురువారం ఏపీ హైకోర్టులో టిక్కెట్ల ధరలపై విచారణ జరిగింది.… -
ఏపీ టికెట్ ధరలు : హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్
గత కొన్ని రోజులుగా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా మారింది పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం…
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!