టికెట్ ధరల అంశంపై సమయం కోరిన సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంపై ఇంకా ఎటూ తేలలేదు. పేదలకు సహాయం చేయడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తమ పనిని సమర్థించుకుంటుంటే, పలువురు సినీ ప్రముఖులు మాత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమ పట్ల, ఎగ్జిబిషన్ రంగం పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సినిమా పెద్దలు కోర్టుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా టికెట్ ధరల నియంత్రణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సినిమా టికెట్ ధరల అంశంపై సమగ్రంగా పరిశీలన జరపాలంటూ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి సినీ పరిశ్రమ కమిటీ భేటీ త్వరలో జరగునుందని ప్రభుత్వం కోర్టుకి తెలిపింది. అంతేకాదు ఈ సమావేశం ఉన్న కారణంగా విచారణ వాయిదా వేయాలని కోర్టును కోరింది ప్రభుత్వం. దీంతో సినిమా టికెట్ రేట్ల విచారణను ఫిబ్రవరి10కి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇక అఫిడవిట్ దాఖలుకు అడ్వకేట్ జనరల్ సమయం కోరినట్టు సమాచారం.
Read Also : రౌడీ బాయ్స్ ‘బృందావనం’లో అనుపమ… మార్మోగుతున్న డిఎస్పీ మాస్ బీట్
Also Read
- Suriya: అలా జరిగిఉంటే జీవితం తలకిందులే.. జ్యోతిక అండతోనే గట్టెక్కా.. సూర్య ఎమోషనల్ కామెంట్స్!
- Sathyathil Sambhavichathu OTT: లంకె బిందెల కోసం తవ్వితే.. ఊరంతా షాక్ అయ్యే నిజం!.. ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్!
- Bloody Romeo : నాని 'బ్లడీరోమియో' షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్
- Meenakshi Choudhary : 29 ఏళ్ల ఏజ్ గ్యాప్ హీరో సరసన హీరోయిన్గా నటిస్తున్న మీనాక్షిచౌదరి
ఆంధ్రాలో సినిమా టికెట్ రేట్ల అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 27న ఓ కమిటీని నిర్ణయిస్తూ జీవో జారీ చేసింది. ఈ కమిటీలో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా, హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్ గా వ్యవహరిస్తోంది. న్యాయశాఖ కార్యదర్శి, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు పురపాలక శాఖ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, సమాచార, పౌర సంబంధాల కమీషనర్, ఎగ్జిబిటర్ వేమూరి బాలరత్నం, డిస్ట్రిబ్యూటర్ తుమ్మల సీతారాంప్రసాద్, సినీ గోయర్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సిబిఎఫ్సి (సెన్సార్ బోర్డ్) సభ్యుడు వడ్డి ఓంప్రకాశ్ నారాయణ, తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు ముత్యాల రాందాస్, డాక్టర్ జూపల్లి రాకేశ్ రెడ్డి, శ్రీమతి గంప లక్ష్మీ సభ్యులుగా నియమితులయ్యారు.
తాజావార్తలు
-
KL Rahul: సహచర ఆటగాళ్లను తిట్టిన కేఎల్ రాహుల్.. అసలు నిజం చెప్పేసిన మాజీ కోచ్!
-
Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Suriya: అలా జరిగిఉంటే జీవితం తలకిందులే.. జ్యోతిక అండతోనే గట్టెక్కా.. సూర్య ఎమోషనల్ కామెంట్స్!
-
Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
ట్రెండింగ్
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
-
ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..