ఏపీ టికెట్ ధరలు : హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా మారింది పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35 ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో చిత్రం పరిశ్రమకు చెందిన వారంతా సంతోషించారు. అయితే ఇప్పుడు వారికి షాక్ ను ఇచ్చే విధంగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. సినిమా టికెట్ ధరల జీవో రద్దుపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో ప్రభుత్వం చేసిన అప్పీల్ లో ప్రభుత్వం తరుపు వాదనలు వినాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ఈ మేరకు లంచ్ మోషన్ ధాఖలు చేయగా, కాసేపట్లో హైకోర్టు వాదనలు విననుంది. మరి ఈ వివాదంపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Read Also : ఆఖరి నిమిషంలో ‘పుష్ప’రాజ్ ఆందోళన… తొలగిన అడ్డంకి
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
గత ఏడాది ఏప్రిల్ లో సినిమా టికెట్ ధరలను తగ్గించాలని, థియేటర్లో రోజుకు 5 షోలు కూడా వేయకూడదని నిర్ణయం తీసుకుంది. దానిని వెనక్కి తీసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు, నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు.. టికెట్ ధరలను పెంచే అధికారాన్ని థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లకు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. సినిమా టిక్కెట్ల రేట్లను తగ్గిస్తూనే, సినిమా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రేక్షకులపై భారం మోపకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే చెబుతోంది. సామాన్యులు, ప్రేక్షకుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తోంది. తగ్గేదే లే అంటూ ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు తీర్పును సవాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ రగడకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో !
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!