ఏపీ టికెట్ ధరలు : హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా మారింది పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35 ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో చిత్రం పరిశ్రమకు చెందిన వారంతా సంతోషించారు. అయితే ఇప్పుడు వారికి షాక్ ను ఇచ్చే విధంగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. సినిమా టికెట్ ధరల జీవో రద్దుపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో ప్రభుత్వం చేసిన అప్పీల్ లో ప్రభుత్వం తరుపు వాదనలు వినాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ఈ మేరకు లంచ్ మోషన్ ధాఖలు చేయగా, కాసేపట్లో హైకోర్టు వాదనలు విననుంది. మరి ఈ వివాదంపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Read Also : ఆఖరి నిమిషంలో ‘పుష్ప’రాజ్ ఆందోళన… తొలగిన అడ్డంకి
Also Read
- Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
- Kayadu Lohar: "రాయితో కొట్టి తల పగలగొట్టా".. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
- Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
- Kalki Sequel: 'కల్కి 2' నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
గత ఏడాది ఏప్రిల్ లో సినిమా టికెట్ ధరలను తగ్గించాలని, థియేటర్లో రోజుకు 5 షోలు కూడా వేయకూడదని నిర్ణయం తీసుకుంది. దానిని వెనక్కి తీసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు, నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు.. టికెట్ ధరలను పెంచే అధికారాన్ని థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లకు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. సినిమా టిక్కెట్ల రేట్లను తగ్గిస్తూనే, సినిమా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రేక్షకులపై భారం మోపకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే చెబుతోంది. సామాన్యులు, ప్రేక్షకుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తోంది. తగ్గేదే లే అంటూ ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు తీర్పును సవాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ రగడకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో !
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!