జగిత్యాల పట్టణం లో ని మార్కండేయ టెంపుల్ అవరణలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుండి మున్సిపల్ చైర్మన్ జ్యోతి, ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ లో కి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఉంటే కేసీఆర్ తెలంగాణ ను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టావాడని విమర్శించారు. కృష్ణ నది జలాల కేటాయింపు కోసం ఆంధ్ర తో యుద్దానికైనా సిద్ధమని, పదవి వచ్చిన రాకపోయినా నేను జగిత్యాల…
భద్రాద్రి రామయ్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రుల బృందం దర్శించుకుంది. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి తోపాటు మంత్రులకు పూర్ణకుంభంతో ఎండోమెంట్ కమిషనర్,ఈవో , అర్చకులు,వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో మూలమరుల వద్ద ముఖ్యమంత్రి , క్యాబినెట్ మంత్రుల బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి, మంత్రుల బృందానికి స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామివారి జ్ఞాపికతో పాటు వేదాశీర్వచనం అందించారు వేద పండితులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి,మంత్రులు కోమటిరెడ్డి,…
హైదరాబాద్ ఉప్పల్ నియోజకర్గంలోని పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాప్రా సర్కిల్ జమ్మిగడ్డ బీజేఆర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేరికల సభకు ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మంధముల పరమేశ్వర రెడ్డి హాజరయ్యారు. చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ తో కలిసి జమ్మిగద్ద ప్రాంతానికి చెందిన 100 మంది…
పదవిలో ఉన్నప్పుడు సన్మానం చేయడం సహజమని, నేను పదవి విరమణ చేసి సంవత్సరం దాటింది అయినా నాకు సన్మానం చేశారని, వెంటాడి మరీ నాకు సన్మానం చేశారు ఎందుకో అర్ధం కాలేదన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఇవాళ ఆయన కు ఖమ్మంలో జిల్లాలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు నాకు అవినాభావ సంబంధం ఉందని, నా చిన్ననాటి స్నేహితులు ఇక్కడ ఉన్నారన్నారు. నేను గతంలో ఖమ్మం వచ్చి మూడు భవనాలకు శంఖుస్థాపన…
వరంగల్ మీదుగా మరో వందేభారత్ ప్రారంభం కానుంది. వరంగల్ మీదుగా సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం నుంచి నడవనుంది. దీనిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా సికింద్రాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటల వరకు విశాఖపట్నంకు వందే భారత్ ట్రైన్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ కాగా.. ఇది తెలంగాణ నుండి నాల్గవ…
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంట్ కష్టాలు ఏర్పడుతున్నాయని కొన్ని మీడియా సంస్థలలో రావడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఖండించారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని విమర్శనాత్మకంగా చిత్రీకరించాయని ఆయన మండిపడ్డారు. నిన్న జగిత్యాలలో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం గురించి రెవెన్యూ అధికారులు విద్యుత్ శాఖకు తెలుపకపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, ప్రతి రెండవ శనివారం రోజున చేపట్టే మరమ్మత్తులకై అధికారులు విద్యుత్తు సరఫరా నిలిపి వేశారన్నారు. అధికారులు సమన్వయ లోపంతో ఏర్పడ్డ అంతరాయాన్ని…
నేడు ఖమ్మంకు రేవంత్.. ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది.. ఇందులో భాగంగానే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఇవాళ (సోమవారం) కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో నేటి మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం కింద…
ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లుగా మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు.. ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారన్నారు. మీ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిందని, వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది, అధికారంలో ఉన్నది కేసీఆర్ కుటుంబమేనని, నిర్బంధాలతో పాలన సాగిస్తామనుకోవడం వారి భ్రమ…
నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఉదయం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్ సీఎం రేవంత్. తర్వాత భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్. భద్రాచలం ఆలయ అభివృద్ధి, నీటిపారుదల అధికారులతో సమీక్ష. సాయంత్రం 4గంటలకు మణుగూరులో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ. నేడు 18 రాష్ట్రాల జాతీయ రహదారులు ప్రారంభం. వర్చువల్గా రహదారులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. ఏపీలో కడప-బెంగళూరు కనెక్టివిటీ హైవే ప్రారంభం. ఏపీలో జాతీయ రహదారుల ప్రారంభోత్సవంలో…
తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల అవుతోందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మూడు నెలల అనేది తక్కువ కాలం కాదన్నారు. మార్పు తెస్తామని ప్రజలకు చెప్పితే…. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చారన్నారు. మార్పు మాత్రం తీరోగమనంలా ఉన్నదని, బీఆర్ఎస్ పాలనలో పొందిన అనేక అవకాశాలు ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోల్పోతున్నారన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో నీళ్ళు లేక ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారని, కేసీఆర్ మీదా నమ్మకంతో…