Amit Sha: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి అమిత్ షా సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా సవాలు విసిరారు. కాంగ్రెస్ చేసిన స్కాంల లిస్ట్ పంపిస్తా.. అవినీతి జరిగిందా లేదా రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని దేశంలో ఏకైక ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు. సీఎంగా చేసినప్పుడు కూడా మోడీ పై అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ ఏమి చేయలేదని.. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా రేషన్ ఇచ్చింది మోడీ సర్కారని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్రంలో ఈసారి 400 సీట్లు రావాలి.. తెలంగాణ నుంచి 12కి పైగా స్థానాలు గెలిపించాలని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకవైపు బీజేపీ ఒకవైపు అని అమిత్ షా చెప్పారు.
Russia: కుప్పకూలిన రష్యా మిలిటరీ కార్గో విమానం.. 15 మంది దుర్మరణం..
Also Read
- Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!
- Shubman Gill: "డోంట్ వర్రీ".. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు మజ్లిస్ గుప్పిట్లో ఉన్నాయి.. ఆ రెండు పార్టీలతో నిజాం పాలన విముక్త తెలంగాణ సాధ్యం కాదని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కుటుంబ పార్టీలేనని ఆరోపించారు. జవహర్ లాల్ నెహ్రూ కుటుంబ పార్టీ కాంగ్రెస్.. కేసీఆర్, కేటీఆర్ ల పార్టీ బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. దేశంలో అన్నివర్గాల ప్రజల పార్టీ బీజేపీ అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలు అని మండిపడ్డారు. 2జీ స్కాం, భోఫార్స్ కుంభకోణం ఇలా దేశంలో కాంగ్రెస్ చేయని అవినీతి లేదని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ కాళేశ్వరం మొదలు ఎన్నో అవినీతి చేశారు.. కవితకు లిక్కర్ స్కాంలో ఆరోపణలున్నాయని తెలిపారు.
Salman Khan : ఆ సౌత్ స్టార్ డైరెక్టర్ తో కొత్త సినిమా ప్రకటించిన సల్మాన్ ఖాన్..
ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు రక్షణ కల్పించారని అమిత్ షా పేర్కొన్నారు. దేశం మోడీ పాలనలో సురక్షంగా ఉంది.. పాకిస్తాన్ ఆటలు మోడీ సాగనివ్వలేదని అన్నారు. CAA తీసుకొచ్చి మూడు దేశాల ముస్లిమేతర శరణార్థులకు సిటిజన్ షిప్ మోడీ సర్కారు ఇస్తోందని తెలిపారు. దేశ విద్రోహ శక్తులకు తప్ప CAA ఎవరికి వ్యతిరేకం కాదు.. CAA సామాన్య శరణార్థులకు వ్యతిరేకం కాదు అని అన్నారు. తెలంగాణ అభివృద్ది కేవలం మోడీ సర్కారుతో సాధ్యం అని తెలిపారు. సోనియా గాంధీకి రాహుల్ గాంధీని పీఎం చేయాలని.. కేసీఆర్ కు కేటీఆర్ ను సీఎం చేయాలని లక్ష్యం అని అమిత్ షా తెలిపారు. దేశంలో బీజేపీ తప్ప అన్ని పార్టీలు కుటుంబాల కోసమేనని అన్నారు. మోడీ సర్కారు మాత్రం భారత కుటుంబ కోసం అని తెలిపారు. ప్రపంచ దేశాల్లో మోడీకి దక్కుతున్న అపూర్వ స్వాగతం మోడీది కాదు.. యావత్ భారత ప్రజలకు దక్కుతున్న గౌరవం అని పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ ను మూడో అగ్ర దేశంగా నిలపడమే మోడీ లక్ష్యం అని అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. పూర్తి జాబితా!
-
The Deverakonda Foundation : స్వగ్రామంలో 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్… విజయ్ దేవరకొండ గొప్ప మనసు
-
Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!
-
Best Electric Scooters: ఓలా, హీరో, టీవీఎస్.. హైయెస్ట్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? కేవలం రూ.44,990 నుంచే ప్రారంభం!
-
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!