Shreyas Iyer: బీసీసీఐ దెబ్బకు తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించిన శ్రేయస్ అయ్యర్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ -2024 లో భాగంగా జరుగుతున్నముంబై – విదర్భ ఫైనల్ మ్యాచ్ లో విధ్వంసక ఇన్నింగ్స్ తో అందరి ఫోకస్ తన పై పడేలా చేశాడు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్. గత కొన్ని రోజులుగా అనవసర వివాదంతో ఈయన వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో ఘోరమైన ఫామ్ లో ఉన్న ఈయనను పూర్తి సిరీస్ కు సెలక్ట్ చేయలేదు బీసీసీఐ. ఈ దెబ్బతో సిరీస్ మధ్యలోనే బెంగళూరులో ఉన్న ఎన్సీఏకు అతడు తిరిగి వెళ్ళాడు. ఆ సమయంలో అతడు నేషనల్ డ్యూటీలో లేకపోవడంతో రంజీ ట్రోఫీలో ఆడమని శ్రేయస్ అయ్యర్ కి బీసీసీఐ సూచించింది. కాకపోతే శ్రేయస్ గాయం సాకుగా చెప్పి ఎన్ఏసీ లోనే ఉండిపోయాడు. ఈ కారణం చేత అతడి కాంట్రాక్ట్ ను బోర్డు రద్దు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
Odisha: ఎన్నికల వేళ మహిళా ఉద్యోగులకు నవీన్ సర్కార్ గుడ్న్యూస్
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఇది ఇలా ఉండగా.., తాజాగా మెరుపు ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు అయ్యర్. ప్రస్తుతం విదర్భ టీంతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో మళ్లీ అతని పై పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వచ్చాయి. కాకపోతే రెండో ఇన్నింగ్స్లో మాత్రం కేవలం 111 బంతుల్లోనే 95 పరుగులు చేసి తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. ఈ ఇనింగ్స్ లో అతడు చేసిన పరుగుల్లో దాదాపు 60 శాతం కేవలం బౌండరీలు, సిక్సుల ద్వారానే అతని ఆట ఏంటో అర్థం అవుతుంది. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సులను కొట్టాడు.
Minister Adimulapu Suresh: బీజేపీపై మంత్రి ఆదిమూలపు హాట్ కామెంట్లు..
ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ తో పాటు ముషీర్ ఖాన్ (136), ముంబై కెప్టెన్ అజింక్యా రహానె (73), షామ్స్ ములానీ (50 *) లతో రాణించడంతో ముంబై రెండో ఇన్నింగ్స్ లో 418 పరుగుల భారీ స్కోరును అందుకుంది. దింతో ఫైనల్ లో గెలవాలంటే విదర్భ టీంకి 537 పరుగుల టార్గెట్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఉన్న మ్యాచ్ పరిస్థితి చూస్తే మాత్రం ముంబై విజయం సునాయాసంగానే కనపడుతోంది. ఈ దెబ్బకు సెన్సేషనల్ నాక్ ఆడిన అయ్యర్ ను సోషల్ మీడియాలో నెటిజన్స్ పొగడ్తలతో మెచ్చుకుంటున్నారు.
తాజావార్తలు
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
-
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
-
IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!