Home
Telugu News
Telugu News News
-
Saeed Ahmed: పాక్ మాజీ కెప్టెన్ కన్నుమూత..
అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) కన్నుమూశారు. అహ్మద్ 1958-73 మధ్య పాక్ తరఫున 41 టెస్టులు ఆడారు. అందులో 5 సెంచరీలు, 16 అర్ధ శతకాలతో 2991 పరుగులు చేశారు. అంతేకాకుండా.. అహ్మద్ రైట్ ఆర్మ్ స్పిన్నర్ కాగా.. 22 వికెట్లు కూడా తీశారు. ఇదిలా ఉంటే.. అహ్మద్ చేసిన 5 శతకాలలో మూడు ఇండియాపైనే నమోదు చేశారు. -
Stone Crushers : సమ్మె విరమించిన స్టోన్ క్రషర్స్ అసోసియేషన్
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ మంత్రి కోమటిరెడ్డి హామీతో సమ్మె విరమించినట్లు ప్రకటించింది. బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు నందిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె విరమించి స్టోన్ క్రషర్స్ నేటి సాయంత్రం నుంచి తమ కార్యకలాపాల ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వపరంగా… -
Top Headlines @5PM : టాప్ న్యూస్
యర్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ న్యాయవాది కేవీ రమణ.. గన్నవరంలో ప్రముఖ న్యాయవాది కేవీ రమణ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలోకి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి యార్లగడ్డ వెంకట్రావ్ సమక్షంలో తెలుగు దేశం పార్టీలో న్యాయవాది కేవీ రమణ జాయిన్ అయ్యారు. అంతకు ముందు వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలంటే టీడీపీ-… -
IPL: ముగిసిన ఒక శకం.. వీరి కెప్టెన్సీ ఇక చూడలేమా..!
ఐపీఎల్ లో ఎక్కువ క్రికెట్ అభిమానులు ఉన్న జట్లు ఏవైనా ఉంటే.. అవి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్. ఎందుకంటే.. తన అభిమాన కెప్టెన్లు ఉండటం వల్లనే ఆ జట్లకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఐపీఎల్ లో చెన్నై, ముంబై మ్యాచ్ ఉందంటే చాలు.. టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతారు. తమ అభిమాన కెప్టెన్లు ఉండటం వల్ల, వారు ఆటలో రచించే వ్యూహాలు అభిమానులకు నచ్చుతాయి కాబట్టి.. ఆ జట్లకు అంతా క్రేజ్ ఉంది. -
Pakistan: పాకిస్థాన్పై నిషేధం!.. ముస్లిం దేశాలు ఎందుకు వీసా ఇవ్వడం లేదంటే?
పాకిస్థాన్ ఇస్లాం పేరుతో గల్ఫ్ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తోంది. కానీ పాకిస్థానీల చర్యలు మాత్రం మధ్యప్రాచ్యంలోని దేశాలు వారితో కేవలం బలవంతంతోనే సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ పర్యాటకం వైపు దూసుకుపోతున్న యూఏఈ వంటి దేశాలు కూడా పాకిస్థానీలను స్వాగతించడానికి సిద్ధంగా లేవు. -
IPL 2024: కొత్త కెప్టెన్ను ప్రకటించిన చెన్నై సూపర్ కింగ్స్..
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఐదుసార్లు ట్రోఫీ సాధించిపెట్టిన సారథి ఎంఎస్ ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా.. కొత్త పాత్రలో కనిపించబోతున్నానని కొన్ని రోజుల క్రితమే ధోని పోస్ట్ చేశారు. మరి ఈ సీజన్ లో ధోనీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతారా లేదా ఇంపాక్ట్ ప్లేయర్ గా… -
Bandaru Dattatreya : ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆస్పత్రిని పరిశీలించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆస్పత్రి లో ఏర్పాటు చేసిన శానిటేషన్, సెక్యూరిటీ అండ్ క్యాన్సర్ నివారణకు అవసరమైన అవగాహన సెంటర్ లను పరిశీలించారు. ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రి లో శ్రీనివాసన్ మునుస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఒకటిన్నర సంవత్సరాల నుండి డా. శరత్ అద్దంకి తన సొంత వ్యయంతో ఆస్పత్రిలో… -
Lunar Eclipse 2024: హోలీరోజే చంద్రగ్రహణం.. పండుగ జరుపుకోవచ్చా?
హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 25న జరగనుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది హోలీ, చంద్రగ్రహణం ఒకేరోజు వస్తున్నాయి. కాబట్టి హోలీ పండుగ జరుపుకోవచ్చా లేదా అనుమానం చాలామందిలో ఉంది. -
Navjot Singh: టీమిండియా బ్యాటర్లలో టాప్ ప్లేయర్ అతనే..
టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ రాజకీయ నాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ కామెంటరీ చేయబోతున్న సంగతి తెలిసిందే.. ఐపీఎల్ 2024 సీజన్ తో వ్యాఖ్యాతగా సిద్ధూ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ క్రమంలో.. సిద్ధూ ఓ ఛానల్ లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ నాలుగేళ్ల పాటు క్రికెట్ ఆడగలడని చెప్పాడు. ఆట సమయంలో విరాట్ కోహ్లీ వైఖరి, దూకుడు, ఆత్మవిశ్వాసం అద్భుతమని సిద్ధూ పేర్కొన్నాడు. -
Kakarla Suresh: ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
ఉదయగిరి ఆత్మీయ సమావేశంలో ఉదయగిరి తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తానని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ సమావేశం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ బయన్న అధ్యక్షతన జరిగింది.
తాజావార్తలు
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్గా రేర్ రికార్డు!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..