IPL 2024: చెన్నై జట్టులో తెలుగు కుర్రాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ సంగ్రామానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఐపీఎల్ 17 సీజన్ రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. కాగా.. రేపు జరిగే తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అసలు విషయానికొస్తే.. చెన్నై జట్టులో తెలుగు కుర్రాళ్లు ఆడుతున్నారు. ఏపీకి చెందిన షేక్ రషీద్, తెలంగాణకు చెందిన అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో.. ఈసారి తెలుగుకుర్రాళ్లు ఐపీఎల్ లో మెరవబోతున్నారు.
Nellore Crime: ఘరానా దొంగలు.. కొట్టేసిన బంగారాన్ని ఏం చేశారో తెలిస్తే షాకవుతారు?
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
చెన్నై టీమ్లో తెలుగు కుర్రాడు షేక్ రషీద్ ఆడుతున్నాడు. అతని స్వస్థలం.. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం. తొమ్మిదేళ్ళ వయసులోనే అండర్-14 క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత.. అంతర్ జిల్లా టోర్నీలో శ్రీకాకుళంపై పన్నెండేళ్ల వయస్సులోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 2017లో అండర్-16 లో 674 పరుగులు చేసి ఆ టోర్నీలోనే అత్యధిక రన్నర్గా రషీద్ నిలిచాడు. 2018లో అండర్-19లో 680 రన్స్తో ఇంటర్నేషనల్ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్ గా రికార్డు సాధించాడు. 2021లో వినూ మన్కడ్లో ఆరు మ్యాచ్లాడిన రషీద్.. రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 400కు పైగా రన్స్ చేశాడు. ఛాలెంజర్ ట్రోఫీలో ఆడిన రషీద్.. మూడు మ్యాచ్ల్లో ఒక సెంచరీ సహా మొత్తం 275 పరుగులు చేశాడు.
Madhya Pradesh: చర్మం ఒలిచి అమ్మకు చెప్పులు కుట్టించిన కొడుకు..
చెన్నై టీమ్లో మరో తెలుగు తేజం మెరవనున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్కి చెందిన అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకున్నారు. అతను.. వికెట్ కీపర్గా, లెఫ్ట్ హ్యాండర్, హార్డ్ హిట్టర్గా అవనీష్ రావు రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రేపు రాత్రి 7.30 ని.లకు చెపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!