నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాగి ఆలయంలో నెల్లూరు వైసీపీ లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే అప్పుల లెక్కలు పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా పరిమితికి మించి అప్పు చేయలేదు.. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ప్రజలు…
సినీ రంగం నుంచి మరో నాయిక రాజకీయాల్లోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ నటి, మోడల్ నేహాశర్మ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల కోసం మహాకూటమిలో సీట్లపై పోరు కొనసాగుతున్న తరుణంలో బీహార్లోని భాగల్పూర్ సీటుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ తన వాదన వినిపించారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొందని, కొన్ని రాష్ట్రాల్లో నామినేషన్లు కూడా ప్రారంభమైనాయన్నారు. దేశంలో పార్లమెంటు ఎన్నికలు 7ఫేస్ లలో జరుగుతున్నాయని, మన తెలంగాణలో 4వ ఫేస్ లో మే 13న ఎన్నికలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేసాకే టిఫిన్ చేయాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. పోలింగ్ రోజు ఉదయం లేవగానే ప్రతీఒక్కరు ఓటు…
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీతో మ్యాచ్లో పంజాబ్ టాస్ నెగ్గింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. నిందితుడు ఈ ఏడాది జనవరిలో చెన్నైలో నివసించినట్లు కూడా గుర్తించారు. నిందితుడిని ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్గా గుర్తించినట్లు వారు తెలిపారు.
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రేణమాల గ్రామంలో వైసీపీకి చెందిన 100 కుటుంబాలు, సుమారు 500 మంది ఓటర్లు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో మండల కన్వీనర్ ఓంకారం ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 28 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపిన ఒక రోజు తర్వాత శనివారం సుకేష్ చంద్రశేఖర్ ఒక సందేశాన్ని పంచుకున్నాడు. ఢిల్లీ కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు తీహార్ జైలుకు వచ్చిన కేజ్రీవాల్కు "స్వాగతం" అని సుకేష్ చంద్రశేఖర్ చెప్పాడు. "నిజం గెలిచింది, నేను అతన్ని తీహార్ జైలుకు స్వాగతిస్తున్నాను" అని సుకేష్ చంద్రశేఖర్ అన్నారు.
K.Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ షాక్ ఇచ్చింది. కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో అధికారులు ఆమెను రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ రోజు బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఈ రోజు బీజేపీలో చేరనున్నారు. ఇటీవల రాజ్యసభ ఎంపీల ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తరుపున క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు. దీంతో వారిపై అనర్హత వేటు వేశారు.
ఐపీఎల్ అంటే ఇష్టపడని ఎవరు ఉంటారు. అందులోనూ సీఎస్కే-ఆర్సీబీ మ్యాచ్ అంటే.. క్రికెట్ అభిమానులకు పండగే. చెన్నై చెపాక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ-చెన్నై మ్యాచ్ ను జియో సినిమాలో అత్యధికంగా 26 కోట్లకు మందిపైగా వీక్షించారు. మొదటి మ్యాచ్ లోనే ఇలా చూశారంటే.. ముందు…