Vijayasai Reddy: చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాగి ఆలయంలో నెల్లూరు వైసీపీ లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే అప్పుల లెక్కలు పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా పరిమితికి మించి అప్పు చేయలేదు.. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ప్రజలు అలాంటివి నమ్మాల్సిన అవసరం లేదు.. రాష్ట్రంలో దుష్ప్రచారం మొదలు పెట్టారని దుయ్యబట్టారు. టీడీపీకి చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన వారే బెట్టింగ్ కు నిధులు ఇస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ప్రజల గుండెల్లో వైసీపీ ఉంది.. ఐదు సంవత్సరాలలో జగన్ వారి మనసుల్లో నిలిచిపోయారని తెలిపారు.
చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు.. ఈ ఎన్నికల తరువాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. లోకేష్ అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు.. ఇక టీడీపీ అనేది ఉండదని విమర్శించారు. బీజేపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా.. ఆ పార్టీ బీజేపీలో విలీనం కావాల్సిందేనని తెలిపారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏందంటే.. బీజేపీలో విలీనం చేయడం తప్ప వారికి వేరే దారిలేదని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో మంచి సంబంధాలు మాత్రమే కొనసాగించాం.. అప్పుడే రాష్ట్రానికి సంబంధించిన నిధులు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మరోవైపు.. నెల్లూరు లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటాం.. నెల్లూరు టౌన్ విషయంలో ఛాలెంజ్ జరుగుతోంది.. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా వైసీపీనే గెలుస్తోందని విజయసాయి రెడ్డి తెలిపారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
Neha Sharma: చిరుత నటి పొలిటికల్ ఎంట్రీ.. లోక్సభ ఎన్నికల బరిలో నేహా!
ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నిత్య పెళ్లి కొడుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయ్ సాయి రెడ్డి గెలిస్తే నెల్లూరులో ఉండడని వేమిరెడ్డి అన్నారని.. ఈయన విజయసాయి రెడ్డి గురించి మాట్లాడటం సరికాదని తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబానికి సాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు.. కుటుంబ సభ్యుడు అని చెప్పారు. నిజాయితీగా చిత్తశుద్ధిగా ఆ కుటుంబం మీద అభిమానంతో ఇప్పటికీ ఎప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ అడిగినా కూడా వేమిరెడ్డి గురించి చెబుతారు.. రాజకీయ బిక్ష పెట్టిన జగన్ కు వెన్నుపోటు పొడిచి పొగరుతో అహంకారంతో బయటికి వెళ్లారని చెబుతారన్నారు. ఒకప్పుడు నెట్టేసిన చంద్రబాబు దగ్గరికి చేరారు.. అమ్మ ప్రశాంతమ్మ నీ రెండో భర్తని నెత్తినెక్కించుకుని ఏవేవో మాట్లాడుతున్నావు…
ఎమ్మెల్యే, మంత్రి రావాలని ప్రశాంతి రెడ్డి కోరిక కలగానే మిగిలిపోతుందని ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!