ఐపీఎల్ 2024లో భాగంగా.. ఆర్సీబీ-రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 184 పరుగుల టార్గెట్ను 19.1 ఓవర్లలో ఛేదించింది. కాగా.. ఈ మ్యాచ్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. ఆర్సీబీ బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయగా.. అతని సెంచరీ వృధా అయింది. రాజస్థాన్ బ్యాటింగ్లో బట్లర్ సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్స్ లు, 9 ఫోర్లు…
రష్యాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మాత్తుగా ఉరల్ నది వరదలు సమీప గ్రామాలలోకి నీరు ప్రవేశించింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లలోనే చిక్కుకుపోయారు. కజకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఓరెన్బర్గ్ ప్రాంతంలో ఆనకట్ట తెగిపోవడంతో భారీగా వరదలు వచ్చాయి. వరదల భారీ నుంచి సుమారు 4,000 మందికి పైగా మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. దీనిపై.. ఓరెన్బర్గ్ గవర్నర్ కార్యాలయం శనివారం ఓ ప్రకటన చేసింది. '1,019 మంది పిల్లలతో సహా 4,208 మందిని రక్షించాం.…
చేతకాక కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్షించారు. తన పార్టీ ప్రభుత్వం ఏమీ చేసిందో తెలియని పరిస్థితిలో రాహుల్ గాంధీ ఉన్నారన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయకుండా అబద్ధాలు చెబుతున్నారని.. దమ్ము, ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ గ్యారెంటీల అమలుపై చర్చకు సిద్దమా అంటూ బహిరంగంగా సవాల్ చేశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు 184 పరుగుల ఫైటింగ్ స్కోరును ఉంచింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఈ సీజన్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 72 బంతుల్లో 113 పరుగులు చేసి నాటౌట్ గా…
జాతీయ మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద విడుదల చేయడం సంతోషమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీఆర్ఎస్ను ఓడించిన ఉత్సాహంతోనే బీజేపీని ఓడించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని రేవంత్ తెలిపారు.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆరు గ్యారంటీలకు అప్లయ్ చేసిన ప్రతి అర్హుడికి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు.
Man Kills Daughter: కూతురిపై ఓ తండ్రి దారుణంగా ప్రవర్తించాడు. చివరకు ఆమె ప్రాణాలను తీశారు. చదువు కోవడం లేదని ఆమెను కొట్టి చంపాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాలో చోటు చేసుకుంది. 17 ఏళ్ల కుమార్తె సరిగా పరీక్షలకు సిద్ధం కావడం లేదని కోపంతో ఆమెను కొట్టి చంపినట్లు శనివారం పోలీసులు తెలిపారు.
ఒకటి, రెండు రోజుల వయస్సులోపు శిశువుల అక్రమ రవాణా నెట్వర్క్ను దేశవ్యాప్తంగా సీబీఐ బట్టబయలు చేసింది. ఢిల్లీ, హర్యానాలో జరిపిన దాడుల్లో 1.5 రోజులు, 15 రోజులు, ఒక నెల వయసున్న ముగ్గురు శిశువులను సీబీఐ ముఠా బారి నుంచి రక్షించింది. వీరిలో ఇద్దరు మగ శిశువులు, ఒక నెల వయసున్న ఆడ శిశువు ఉన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. జైపూర్లోని సవాయ్ మన్ సింగ్ స్టేడియంలో.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో.. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.