జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ ల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలతో జలాశయాల్లో నీరు నిల్వ ఉండలేక, వరదల సమయం లో ఇబ్బంది ఎదుర్కొంటున్నామని, సీఎం రేవంత్ జంట నాగరాల్లో అక్రమణలా తొలగింపునాకు హైడ్రా ఏర్పాటు చేయడం చైర్మన్ గా సీఎం ఉండడం అభినందనీయన్నారు. బఫర్ జోన్ రక్షణ దిశగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు.…
హైదరాబాద్ NMDC మారథాన్లో ఈశా బ్రహ్మచారులు, ఇంకా వాలంటీర్లు ఈశా విద్యకు మద్దతుగా పరిగెత్తారు ఈశా విద్య పై అవగాహన, ఇంకా నిధులను సేకరించే ప్రయత్నంలో, 31 మంది ఈశా బ్రహ్మచారులతో పాటు 170కి పైగా మద్దతుదారులు ఆగస్టు 25న హైదరాబాద్లో జరిగిన NMDC మారథాన్లో పాల్గొన్నారు. వారు 42 కిమీ పూర్తి మారథాన్, ఇంకా 21 కిమీ హాఫ్ మారథాన్లో, 10కే రన్లలో పాల్గొన్నారు.
మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ గల్లంతు అయింది. ఆ మహిళ ఫుట్పాత్పై నడుచుకుంటూ వెళుతుండగా.. ఒక్కసారిగా ఫుట్పాత్ కుంగడంతో.. ఆమె డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది.
హైదరాబాద్లో గచ్చిబౌలిలో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్-కన్వెన్షన్కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయని నాగార్జున పేర్కొన్నారు
హైదరాబాద్లో పాత బస్తీ ప్రాంతంలోని ఓ బ్యాంక్లో రూ.175 కోట్ల లావాదేవీలు జరిగినట్లు భారీ సైబర్ క్రైం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఇద్దరు ఆటో రిక్షా డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో-రిక్షా డ్రైవర్లు జాతీయ బ్యాంకులో ఆరు ఖాతాలను తెరిచారు, సైబర్ నేరగాళ్ల ద్వారా నిధుల బదిలీని సులభతరం చేశారు. ఈ నిధులను హైదరాబాద్ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు తరలించారు. సైబర్ నేరగాళ్లు నిధులను బదిలీ చేయడానికి క్రిప్టోకరెన్సీని కూడా ఉపయోగించారు.…
మాజీ ఎమ్మెల్యేలకు నెలవారీ పెన్షన్ను రూ.50 వేలకు పెంచుతున్నట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.22 వేలు పింఛన్ అందుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది.
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ (20708/20707) ఎక్స్ప్రెస్ రైలుకు ఏలూరు స్టేషన్లో ఒక నిమిషం హాల్టింగ్ సదుపాయాన్ని రైల్వే అధికారులు కల్పించారు. ఏలూరులో నేడు తొలిసారిగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగింది.
పాకిస్థాన్పై విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ జట్టు భారీ ఆధిక్యాన్ని అందుకుంది. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు.. అటు శ్రీలంకపై విజయంతో ఇంగ్లండ్ కూడా పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది.
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల గురించి మాట్లాడినప్పుడల్లా ఎలాన్ మస్క్, జెఫ్ బోజెస్, ముఖేష్ అంబానీ తదితరుల పేర్లు తెరపైకి వస్తాయి. వారు ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు అనడంలో సందేహం లేదు. అయితే వీరంతా పురుషులే. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? ఈ మహిళ పేరు ఆలిస్ వాల్టన్. 74 ఏళ్ల ఆలిస్ వాల్టన్ ఒక పెద్ద అమెరికన్ వ్యాపార మహిళ. ఆమె వాల్మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె.
రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ అవసరాలను త్వరలో క్లియర్ చేస్తామన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను మంత్రి ప్రస్తావిస్తూ, త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని, దీని కింద అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెండేళ్లలో ప్రభుత్వ భవనాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయని ఆయన అన్నారు.…