Cyber Crime : హైదరాబాద్ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్… పాతబస్తీలో బ్యాంకు నుంచి రూ.175 కోట్లు లావాదేవీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో పాత బస్తీ ప్రాంతంలోని ఓ బ్యాంక్లో రూ.175 కోట్ల లావాదేవీలు జరిగినట్లు భారీ సైబర్ క్రైం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఇద్దరు ఆటో రిక్షా డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో-రిక్షా డ్రైవర్లు జాతీయ బ్యాంకులో ఆరు ఖాతాలను తెరిచారు, సైబర్ నేరగాళ్ల ద్వారా నిధుల బదిలీని సులభతరం చేశారు. ఈ నిధులను హైదరాబాద్ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు తరలించారు. సైబర్ నేరగాళ్లు నిధులను బదిలీ చేయడానికి క్రిప్టోకరెన్సీని కూడా ఉపయోగించారు. బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి హవాలా ద్వారా విదేశాలకు డబ్బులు తరలించినట్లు పోలీసులు విచారణలో తేలింది. హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగినట్లు, 600 కంపెనీలకు అకౌంట్లను సైబర్ నేరగాళ్లు లింక్ చేసినట్లు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్ల డబ్బులకు ఆశపడి ఆటో డ్రైవర్లు అకౌంట్లు తెరిచినట్లు, సైబర్ నేరగాళ్ల వెనుక చైనా కేటుగాళ్ల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అధికారులు ఈ లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు. కేసులో ప్రమేయం ఉన్న అదనపు అనుమానితుల పోలీసులు గాలిస్తున్నారు.
Crime: రోజూ తాగొచ్చి తల్లిని కొడుతున్న తండ్రి.. రాడ్డుతో కొట్టి చంపేసిన మైనర్ కొడుకు
Also Read
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..