శాఖల కేటాయింపు తర్వాత సచివాలయానికి మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వచ్చారు. ఈ క్రమంలో.. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు, సెక్రటరీ టి కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే. హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్ రవి, వివిధ శాఖల ఉన్నత అధికారులు స్వాగతం పలికారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులకు అధికారులు స్వాగతం పలికారు.…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వందల కోట్లు అవినీతికి ప్రజా ప్రతినిధులే పాల్పుడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 13 బీసీ సంఘాలు అభినందించాయి. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి. మరోవైపు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులు అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుందాగా ప్రవర్తిస్తున్న తీరు.. ప్రజా సమస్యల పరిష్కరానికి ఎన్నికల తీరు చాలా గొప్పగా ఉందని ఆర్. కృష్ణయ్య తెలిపారు. గత ప్రభుత్వం నిరంకుశంగా, ప్రజా వ్యతిరేకంగా ప్రవర్తించడంతో.. నిరుద్యోగులు, బి.సి సంఘాలు పోరాటం చేసి ఆ ప్రభుత్వానికి తగిన…
మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. వరి ధాన్యం కొనుగోలు ఎప్పుడు ప్రారంభిస్తారు.. బోనస్ కింద రూ.500 ఎప్పుడు ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారం చేపట్టి రెండు రోజులు కూడా కాకముందే.. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పందగా ఉందని తెలిపారు. ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం.. 15 రోజుల లోపు ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల సంఘం ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో.. బీఆర్ఎస్…
తుఫాన్ కారణంగా రైతులంతా నష్టపోయారని.. ఎక్కడ చూసినా హృదయ విదారకంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తూర్పు గోదావరి జిల్లా నన్నయ్య యూనివర్సిటీలో మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు, ఆంధ్రాకు ఎటువంటి సంబంధం లేదని.. 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ననే ఒన్స్ మోర్ అవుతారని మంత్రి పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తమకు వచ్చిన ఓట్లు, సీట్లు చూస్తే రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అధికారం సాధించే దిశలో పయనిస్తుందని తెలిపారు. డబ్బు, మద్యం ప్రభావంను పక్కన పెట్టి ప్రజలు బీజేపీకి విజయాన్ని కట్ట బెట్టారని అన్నారు. బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం…
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ మనవడు, బీజేపీ ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఐఏఎస్ ఆఫీసర్ పరి బిష్ణోయ్ని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నెల 22న వీరి వివాహం జరగనుంది. అయితే ఇందులో పెద్ద విశేషమేముంది అనుకోవచ్చు..కానీ ఈ పెళ్లికి అనేక ప్రత్యేకతలున్నాయి.