Road Accident: కారును డీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటకలో ఈ రోజు (శుక్రవారం) ఉదయం 11 గంటల సమయంలో శిరసి నుంచి కుంట వెళ్తున్న ఆర్టీసీ బస్సు అలానే కుంట నుంచి శిర్సికి వస్తున్న మారుతీ స్విఫ్ట్ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. కాగా బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో మొత్తం 5 మంది ఉన్నారు. కాగా వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అలానే ఓ వ్యక్తి గాయపడ్డారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
కాగా ఆ సమయంలో బస్సులో డ్రైవర్ తో పాటుగా 60 ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ఘటనలో డ్రైవర్ కి గాని, బస్సులోని ప్రయాణికులకు గాని ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఈ ఘటనలో కారులోని ప్రయాణికుల్లో 4 మరణించగా.. ఓ వ్యక్తి గాయపడ్డారని.. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అలానే కారులోని వ్యక్తులు తమిళనాడుకి చెందినవారిగా గుర్తించామని పేర్కొన్నారు. కాగా మరణించిన వారి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?