Andhrapradesh: వైసీపీ ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నకిలీ, డబుల్ ఎంట్రీ ఓట్ల వ్యవహారం రాజకీయ రచ్చ రాజేస్తోంది. ఓట్లకు సంబంధించి వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణలు, విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. కొంతకాలం నుంచి ఓట్ల వ్యవహారానికి సంబంధించి వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే.. బోగస్ ఓట్లు, ఓట్ల తొలగింపుపై యుద్ధం కొనసాగుతుండగా.. ఇప్పుడు.. వైసీపీ నేతలు మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఈవోకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే.
Read Also: Supreme Court: ‘‘రెండు నిమిషాల లైంగిక సుఖం కోసం’’.. హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం..
Also Read
ఈ వ్యవహారంలో వైసీపీ ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పందించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, తెలంగాణ, ఏపీలో డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఇటువంటి ఫిర్యాదులపై విచారణ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల నమోదుకు సంబంధించి కేంద్ర ఎన్నికల నిబంధనలు, నియమావళిని పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!