CM Switzerland visit: సీఎం అండ్ టీం బిజీబిజీ.. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Switzerland visit: స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు భారత రాయబారి మృదుల్ కుమార్ తో జ్యూరిచ్లో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ కంపెనీలు, పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
Renu Desai: నేను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు.. ట్రోలర్స్, యూట్యూబ్ ఛానళ్లపై ఆగ్రహం..!
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని సీఎం భారత రాయబారిని కోరారు. ముఖ్యంగా ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, ఆర్ అండ్ డీ కేంద్రాలు వంటి రంగాల్లో సహకారం కావాలని వివరించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక పాలసీలు, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న నిర్ణయాలను రాయబారి మృదుల్ కుమార్కు వివరించారు.
HCM Shri N. Chandrababu Naidu met with Ambassador of India to Switzerland, Shri Mridul Kumar, in Zurich.
Ambassador Kumar commended the landmark success of the HCM’s Davos 2025 visit, which has catalysed over ₹2 lakh crores in grounded investments for Andhra Pradesh.… pic.twitter.com/PjLH8E5uwq
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 19, 2026
2025లో సీఎం చంద్రబాబు చేపట్టిన దావోస్ పర్యటన విజయవంతమైందని, దాని ద్వారా రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాకారమయ్యాయని భారత రాయబారి మృదుల్ కుమార్ వెల్లడించారు. అంతేకాకుండా ఎన్నార్టీల భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి మరింత దోహదం చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ఇంకా మధ్య యూరప్లోని లిచ్టెన్స్టైన్ దేశంలో జరుగుతున్న ఏఐ పురోగతిపై మృదుల్ కుమార్ సీఎంకు వివరించారు.
యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ బీస్ట్ గా రాబోతున్న iQOO 15 Ultra.. లాంచ్ ఎప్పుడంటే..?
ఈ భేటీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్కు చెందిన ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ఏపీకి రావడానికి సహకరించాలని భారత రాయబారిని కోరారు. వివిధ కంపెనీలతో ఏపీని కనెక్ట్ చేయడంలో రాయబారి కీలక పాత్ర పోషించాలని సూచించారు. వివిధ రంగాలకు అవసరమైన మ్యాన్ పవర్ సప్లై చేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని, యువతకు నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే 100 కేజీల బరువు మోసే డ్రోన్లు తయారు చేసే కంపెనీలు ఏపీలో ఉన్నాయని, వాటిని స్విట్జర్లాండ్ కంపెనీలతో కనెక్ట్ చేస్తామని చెప్పారు. బీ టు బీ (B to B) భాగస్వామ్యంతో పెట్టుబడులను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు.
Had a productive meeting in #Zurich with Mridul Kumar, Ambassador of India to Switzerland. We discussed strengthening AP–Switzerland trade ties and encouraging Swiss companies to invest in Andhra Pradesh across technology, manufacturing, electronics, pharma, rail, R&D and… pic.twitter.com/pMzHVOgcvV
— Lokesh Nara (@naralokesh) January 19, 2026
తాజావార్తలు
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?