లోకేష్ పాదయాత్ర… టీడీపీకి పాడే యాత్రే..! టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు రాస్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి.. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర వెల వెల పోతుంటే ఎమ్మెల్యే పెద్దారెడ్డి యాత్ర గ్రాండ్ సక్సెస్…
Solar Roof Cycling Track: కోకాపేట లే అవుట్ లో రూ.95 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పక్క గుండా 4.5 మీటర్ల వెడల్పు 23 కిలోమీటర్ల వరకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సోలార్ రూప్ సైక్లింగ్ ట్రాక్ నిర్మాణపు పనులను పరిశీలించారు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రె.. నానక్ రాంగూడ నుండి టీఎస్పీఏ వరకు, నార్సింగ్ నుండి కొల్లూరు వరకు ఈ నిర్మాణం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపిన ఆయన.. ఇదే విషయాన్ని తన ట్విట్టర్…
తంత్రాలు అయిన కుతంత్రాలైన బీజేపీకే సాధ్యం ఇవాళ ఉభయసభల్లో బడ్జెట్పై సాధారణ చర్చ జరగతుంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ… 5,375 కోట్లు ఇవ్వాలని ఫైనాన్స్ కమిషన్ చెప్పినా కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఫైనాన్స్ కమిషన్ చెప్పినా పట్టించుకోని ఏకైక ప్రభుత్వం మోడీ సర్కార్ అని ఆయన మండిపడ్డారు. సెస్ల రూపంలో కేంద్రం వసూలు చేస్తుందని, అప్పుల విషయంలో…
మంచిర్యాల జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. నిన్న (మంగళవారం) మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతి చెందిన జ్యోతి మున్సిపల్ కమిషనర్ భార్య కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
ఇవాళ ఉభయసభల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనుంది..శాసనభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్పై చర్చ చేపడతారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పై చర్చ జరపనున్నారు. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు వెలిచాల జగపతిరావు, మందాడి సత్యనారాయణ రెడ్ఇ, గడ్డం రుద్రమదేవికి శాసనసభ సంతాపం ప్రకటించనుంది.
Off The Record: MIM హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన పార్టీగా ఇన్నాళ్లు గుర్తింపు ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పోటీ చేయకపోయినా నాలుగైదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మహారాష్ట్ర, యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉనికి చాటుకుంది. ఇప్పుడు టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణలోని మిగిలిన నియోజకవర్గాలపై ఎంఐఎం దృష్టిపెట్టింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్-ఎంఐఎం వాగ్వాదంలో తాము ఈసారి కనీసం 50 సీట్లలో పోటీ చేస్తామని…
Off The Record: మిర్యాలగూడ కాంగ్రెస్లో చాలాకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయులు పార్టీ కార్యాలయంలోనే ఘర్షణ పడ్డారు. పరస్పరం పోలీస్లకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇది అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగిన గొడవగా కార్యకర్తలు భావించడం లేదట. కొంత కాలంగా లక్ష్మారెడ్డి మిర్యాలగూడ టికెట్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. తన సొంత ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ…