High Court: ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు.. విచారణ ఈనెల 27 కు వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. రెగ్యులర్ బెంచ్ విచారిస్తుందన్న ధర్మాసనం వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని కోర్టుకు అధికారుల తరపున న్యాయవాదులు తెలిపారు. తెలంగాణలో క్యాడర్ అలాట్మెంట్పై 11 మంది ఆలిండియా సర్వీస్ అధికారులు, తెలంగాణ డీజీపీ అంజనీకుమార్తో పాటు ఐఏఎస్ అధికారుల్లో వాణీ ప్రసాద్, వాకాటి అరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి ఉన్నారు. 9 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఏపీకి పంపడాన్ని క్యాట్(సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) ఆపేసిన విషయం తెలిసిందే. క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. నేడు హైకోర్టు ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో హైకోర్టు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.
Read also: Cheddi Gang: అమ్మో మళ్లీ వచ్చారు.. మహబూబ్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ 11 మంది కేంద్ర సర్వీసు అధికారులకు ఏపీ కేడర్ను ఖరారు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వారంతా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. తెలంగాణలో పనిచేయాలని క్యాట్ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 2017 నుంచి పెండింగ్లో ఉన్న ఈ కేసు 27కు వాయిదా పడింది. ఇటీవల హైకోర్టు సోమేశ్ కుమార్ను ఏపీ కేడర్గా ప్రకటించి, గతంలో క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఏపీకి బదిలీ చేసింది. ఈనేపథ్యంలో ఈరోజు ఎలాంటి తీర్పు వెలువరించబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Read also: High Court: ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు.. విచారణ ఈనెల 27 కు వాయిదా
ముఖ్యంగా తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్ ఇక్కడే ఉంటారా? లేక ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయా అనేది ఆసక్తిగా మారింది. ఈ 11 మందిలో 9 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉండగా.. వాణీ ప్రసాద్, వాకాటి అరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి సహా పలువురు అధికారులు ఉన్నారు. ఏపీ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విచారించిన హైకోర్టు సోమేశ్కుమార్ను ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. అందుకే ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు 11 మంది ఐఏఎస్ అధికారుల వంతు వచ్చింది. మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.
Manikrao Thakur: నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో థాక్రే పర్యటన
తాజావార్తలు
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!