High Court: ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు.. విచారణ ఈనెల 27 కు వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. రెగ్యులర్ బెంచ్ విచారిస్తుందన్న ధర్మాసనం వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని కోర్టుకు అధికారుల తరపున న్యాయవాదులు తెలిపారు. తెలంగాణలో క్యాడర్ అలాట్మెంట్పై 11 మంది ఆలిండియా సర్వీస్ అధికారులు, తెలంగాణ డీజీపీ అంజనీకుమార్తో పాటు ఐఏఎస్ అధికారుల్లో వాణీ ప్రసాద్, వాకాటి అరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి ఉన్నారు. 9 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఏపీకి పంపడాన్ని క్యాట్(సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) ఆపేసిన విషయం తెలిసిందే. క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. నేడు హైకోర్టు ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో హైకోర్టు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.
Read also: Cheddi Gang: అమ్మో మళ్లీ వచ్చారు.. మహబూబ్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ 11 మంది కేంద్ర సర్వీసు అధికారులకు ఏపీ కేడర్ను ఖరారు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వారంతా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. తెలంగాణలో పనిచేయాలని క్యాట్ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 2017 నుంచి పెండింగ్లో ఉన్న ఈ కేసు 27కు వాయిదా పడింది. ఇటీవల హైకోర్టు సోమేశ్ కుమార్ను ఏపీ కేడర్గా ప్రకటించి, గతంలో క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఏపీకి బదిలీ చేసింది. ఈనేపథ్యంలో ఈరోజు ఎలాంటి తీర్పు వెలువరించబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Read also: High Court: ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు.. విచారణ ఈనెల 27 కు వాయిదా
ముఖ్యంగా తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్ ఇక్కడే ఉంటారా? లేక ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయా అనేది ఆసక్తిగా మారింది. ఈ 11 మందిలో 9 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉండగా.. వాణీ ప్రసాద్, వాకాటి అరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి సహా పలువురు అధికారులు ఉన్నారు. ఏపీ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విచారించిన హైకోర్టు సోమేశ్కుమార్ను ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. అందుకే ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు 11 మంది ఐఏఎస్ అధికారుల వంతు వచ్చింది. మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.
Manikrao Thakur: నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో థాక్రే పర్యటన
తాజావార్తలు
-
Peddi : అదిరిందిపోయిన రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రోమో..
-
Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
-
Kirrak Seetha: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ఆరోపణలు!
-
IPL 2026 Playoffs Scenario: గుజరాత్ ఘన విజయం.. తగ్గిన ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఛాన్సెస్.. సీఎస్కేకు ప్లస్!
-
Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!