Off The Record: బీఆర్ఎస్ సభ అక్కడే ఎందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముగ్గురు సీఎంలను తీసుకొచ్చి ఖమ్మం సభ సక్సెస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదుపరి వ్యూహం ఏంటి? పొరుగున ఉన్న ఏపీనే BRS టార్గెట్టా? విశాఖలో KCR సభ ప్రకటించడానికి ప్రత్యేక కారణం ఉందా?
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
ఏపీలోనూ ఖమ్మం బీఆర్ఎస్ సభ ప్రభావం..!
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి బహిరంగసభను ఏపీ సరిహద్దుల్లో ఉన్న ఖమ్మం జిల్లాలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండేది ఈ జిల్లాలోనే. మొదట ఢిల్లీలో నిర్వహించాలనుకున్న ఈ సభను ఖమ్మానికి మార్చుకుంది. ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంల సమక్షంలో ఇక్కడే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముగ్గురు సీఎంలతోపాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, CPI ప్రధాన కార్యదర్శి డి రాజా కూడా ఈ సమావేశానికి హాజరుకావడంతో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ దృష్టిని ఆకర్షించింది. బిజెపి, కాంగ్రెస్లకు వ్యతిరేకంగా తామంతా ఒకటే అనే సంకేతం ఇచ్చింది అధికారపార్టీ.
విశాఖలో తదుపరి బీఆర్ఎస్ బహిరంగ సభ..!
ఖమ్మం తర్వాత నెక్ట్స్ బహిరంగసభ ఆంధ్రప్రదేశ్లోనే అని బీఆర్ఎస్ ప్రకటించింది. అదీకూడా ప్రతిపాదిత ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖలో సీఎం కేసీఆర్ సభ ఉంటుందని చెబుతోంది. త్వరలోనే సభ తేదీని ఫైనల్ చేయనుంది. బయటి రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఏపీ మినహా ఎక్కడా రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించలేదు. ఏపీకి అధ్యక్షుడిని ఎంపిక చేయడంతోపాటు రిటైర్డ్ సివిల్ సర్వెంట్లను బీఆర్ఎస్లో చేర్చుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ నిర్వహించబోయే సభపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
విశాఖ సభకు ఎవరెవరిని ఆహ్వానిస్తారు?
విశాఖలో బీఆర్ఎస్ సభకు సీఎం కేసీఆర్ ఎవరెవరిని ఆహ్వానిస్తారనేది ఉత్కంఠగా మారింది. 175 సీట్లలో పోటీ చేస్తామని చెబుతున్న ఆ పార్టీ.. ఏపీలో వేయబోతున్న అడుగులను అన్ని పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి. ఏపీలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలైన వైసీపీ, టిడిపి, బిజెపి, జనసేనతో సంబంధం లేకుండా కేసీఆర్ సభను నిర్వహించబోతున్నారు. అలాగే ఏపీలో మూడు రాజధానులపై గులాబీ బాస్ ఏం చెబుతారు? ఏపీలోని అధికార వైసీపీని టార్గెట్ చేస్తారా? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!