తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి ధాన్యం కొనుగోలుకు యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. ఈ మేరకు యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది.
పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి(BRS) నిర్ణయించింది. ఈమేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ఈరోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
రాజకీయాల కోసమే ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని సవాల్ విసిరారు.
హైదరాబాద్ నగరంలోని చందానగర్ పీఎస్ పరిధిలో విషాదం నెలకొంది. చందానగర్ పీఎస్ పరిధిలోని తారానగర్లో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఇంట్లో ఆడుకుంటూ పొరపాటున మస్కిటో లిక్విడ్ తాగి ప్రాణాలు కోల్పోయాడు.