CM Revanth Reddy : ధీరత్వమే దైవత్వంగా మారిన చరిత్ర మేడారం మహోత్సవం
- ధీరత్వమే దైవత్వంగా మారిన చరిత్ర మేడారం మహోత్సవం
- కాకతీయులకు ఎదురు నిలిచిన ధీరవనితలు సమ్మక్క-సారలమ్మలు
- దక్షిణాది కుంభమేళా మేడారం జాతర
- ఆనాడు ఫిబ్రవరి 6, 2023న ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించా
- తల్లుల ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర వేళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్. రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాలతో గిరిజన గడ్డపై అడుగుపెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల, అది కూడా మేడారం వంటి పుణ్యక్షేత్రంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి ముఖ్యమంత్రి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. మేడారం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గిరిజన తల్లుల గొప్పతనాన్ని కొనియాడారు. “ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం. కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీరవనితలు సమ్మక్క-సారలమ్మలు. గుడి లేని ఆ తల్లులను గుండె నిండా కొలుచుకునే తెలంగాణ ప్రజల అతిపెద్ద గిరిజన సంస్కృతికి ఈ జాతర నిదర్శనం” అని ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు.
తన రాజకీయ ప్రస్థానంలో మేడారం పాత్రను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 6న అప్పటి ప్రజా కంటక పాలనను గద్దె దించాలని ఇదే మేడారం గడ్డపై మొక్కుకుని తాను పాదయాత్ర ప్రారంభించానని తెలిపారు. “ఆనాడు తల్లుల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేడు ఆ మొక్కును తీర్చుకునే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేడారం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం వంద రోజుల వ్యవధిలోనే రాతి కట్టడాలతో తల్లుల ప్రాంగణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని తాను అధికారులను ఆదేశించానని, జాతర నాటికి ఆ పనులన్నీ పూర్తి కావడం గర్వకారణమని చెప్పారు. భవిష్యత్తులో తన జీవితంలో ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకుంటే, గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేశానని గర్వంగా చెప్పుకుంటానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
- Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
- Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
- Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
భక్తుల సౌకర్యార్థం జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. రామప్ప, లక్నవరం చెరువుల నుండి జంపన్న వాగుకు నీటిని తరలించేలా శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రేపు ఉదయం సమ్మక్క-సారక్క నూతన ఆలయాన్ని ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు. మేడారం జాతరను దేశవ్యాప్తంగా గుర్తించేలా, కుంభమేళా స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, గిరిజన సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
IND vs NZ: రోహిత్ శర్మ 2027 ODI వరల్డ్ కప్కు దూరమవుతాడా?.. ODI సిరీస్లో ఘోరంగా విఫలం
తాజావార్తలు
-
Director VV Vinayak: వడ్డే నవీన్ సినిమా వల్లే ఎన్టీఆర్తో పరిచయం.. ‘ఆది’ మూవీ జ్ఞాపకాలను పంచుకున్న డైరెక్టర్!
-
Water Tank Cleaning Tips: వాటర్ ట్యాంక్లో మురికి పేరుకుపోయిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేయండి
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘‘భారత క్రికెట్ నిధి’’.. మాజీ స్టార్ ప్రశంసలు..
-
US-Iran: ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Aashirwad Sooryavanshi: మరో సూర్యవంశీ వస్తున్నాడండోయ్.. తొలి శతకాన్ని నమోదు చేసిన ఆశీర్వాద్..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!