CM Revanth Reddy : ధీరత్వమే దైవత్వంగా మారిన చరిత్ర మేడారం మహోత్సవం
- ధీరత్వమే దైవత్వంగా మారిన చరిత్ర మేడారం మహోత్సవం
- కాకతీయులకు ఎదురు నిలిచిన ధీరవనితలు సమ్మక్క-సారలమ్మలు
- దక్షిణాది కుంభమేళా మేడారం జాతర
- ఆనాడు ఫిబ్రవరి 6, 2023న ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించా
- తల్లుల ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర వేళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్. రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాలతో గిరిజన గడ్డపై అడుగుపెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల, అది కూడా మేడారం వంటి పుణ్యక్షేత్రంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి ముఖ్యమంత్రి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. మేడారం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గిరిజన తల్లుల గొప్పతనాన్ని కొనియాడారు. “ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం. కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీరవనితలు సమ్మక్క-సారలమ్మలు. గుడి లేని ఆ తల్లులను గుండె నిండా కొలుచుకునే తెలంగాణ ప్రజల అతిపెద్ద గిరిజన సంస్కృతికి ఈ జాతర నిదర్శనం” అని ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు.
తన రాజకీయ ప్రస్థానంలో మేడారం పాత్రను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 6న అప్పటి ప్రజా కంటక పాలనను గద్దె దించాలని ఇదే మేడారం గడ్డపై మొక్కుకుని తాను పాదయాత్ర ప్రారంభించానని తెలిపారు. “ఆనాడు తల్లుల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేడు ఆ మొక్కును తీర్చుకునే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేడారం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం వంద రోజుల వ్యవధిలోనే రాతి కట్టడాలతో తల్లుల ప్రాంగణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని తాను అధికారులను ఆదేశించానని, జాతర నాటికి ఆ పనులన్నీ పూర్తి కావడం గర్వకారణమని చెప్పారు. భవిష్యత్తులో తన జీవితంలో ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకుంటే, గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేశానని గర్వంగా చెప్పుకుంటానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
భక్తుల సౌకర్యార్థం జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. రామప్ప, లక్నవరం చెరువుల నుండి జంపన్న వాగుకు నీటిని తరలించేలా శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రేపు ఉదయం సమ్మక్క-సారక్క నూతన ఆలయాన్ని ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు. మేడారం జాతరను దేశవ్యాప్తంగా గుర్తించేలా, కుంభమేళా స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, గిరిజన సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
IND vs NZ: రోహిత్ శర్మ 2027 ODI వరల్డ్ కప్కు దూరమవుతాడా?.. ODI సిరీస్లో ఘోరంగా విఫలం
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
-
Triumph Bonneville T120: భారత్లో లాంచ్ అయిన ట్రయంఫ్ బోనేవిల్ T120.. రెట్రో డిజైన్ ధర, ఫీచర్లు ఇవే
-
Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
-
Peddi: భోపాల్లో ‘పెద్ది’ ఆడియో లాంచ్పై భారీ ప్లాన్..ఈవెంట్కు ఏఆర్ రెహమాన్ స్పెషల్ ట్రీట్
-
Rukmini Vasanth: బికినీ వీడియోతో షాక్ ఇచ్చిన రుక్మిణి వసంత్.. నెట్టింట హాట్ టాపిక్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!