Telangana : దారుణం.. చికెన్ వండలేదని భార్యను గొడ్డలితో నరికిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యా భర్తల మధ్య గొడవలు సహజం.. అయితే చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పడటం సహజం.. కొన్ని గొడవలు చావు వరకు వెళ్తున్నాయి.. మరికొన్ని ఘటనలు కుటుంబాలను విడగొడుతున్నాయి.. చిన్నచిన్న కారణాలకే హత్యల దాకా వెళుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయని పోలీసులు అంటున్నారు. మాటలతో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారని, కోపతాపాలను కాస్త అదుపులో పెట్టుకోవాలని. భార్యాభర్తల మధ్య గొడవలు మామూలే కానీ.. ఇలా నరక్కోవడం వరకు రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.. తాజాగా కూర వండలేదని భార్యను అతి దారుణంగా భర్త చంపాడు.. ఈ దారుణ ఘటన తెలంగాణలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. తెలంగాణాలోని మంచిర్యాల లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.. రాత్రికి చికెన్ కూర వండాలని చెబితే.. వంకాయ కూర వండిందని కోపానికి వచ్చిన ఆ భర్త. గొడ్డలితో భార్య మీద దాడి చేసి హత్య చేశాడు. నిద్రిస్తున్న సమయంలో దాడి చేయడంతో గాలిపెల్లి శంకరమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను చంపిన భర్త గాలిపెల్లి పోశం అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం వెలుగు చూడడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు..
Also Read
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
కాగా, మార్చిలో ఇలాంటి ఘటనే ఏపీలోని ఒంగోలు లో వెలుగు చూసింది. క్షణికావేశం నిండు కుటుంబాన్ని ఒక్క రాత్రి లో తలకిందులాగా చేసింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన కలహాలు.. తద్వారా క్షణికావేశం ఇద్దరు చిన్నారులను అనాధలుగా మార్చేసింది. డాకా అంజిరెడ్డి,పూర్ణిమ దంపతులు. చిన్న గొడవ జరగడం తో భార్యను కోట్టి చంపాడు.. భార్య చనిపోయిందని తెలియగానే అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. పిల్లలు అనాధలుగా మారారు..క్షణికావేశంలో తొందర పడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు..
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!