గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర చర్యలపై మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తం చేస్తున్నారు. రెండు రోజులుగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వరద నుంచి ప్రజలను కాపాడుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా చూడాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈనెల 29వ తారీఖున ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు వెల్లడించారు. అయితే, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నారు.
Dil Raju inagurates SVC Cinemas: ఎగ్జిబిటర్గా సినీ కెరీర్ మొదలు పెట్టి డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఆ తర్వాత దిల్ సినిమా నిర్మించి నిర్మాతగా మారారు దిల్ రాజు. నిర్మాత అయిన తర్వాత కూడా డిస్ట్రిబ్యూషన్ వదలకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో టాప్ ప్రొడ్యూసర్ గా మారిన తరువాత కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి గ్రిప్ సాధించుకున్నాడు. Kushi : 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి మళ్ళీ ట్రెండింగ్లో ‘నా రోజా నువ్వే’ ఎగ్జిబిటర్…
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పర్యటించారు. గజ్వేల్ అల్లర్లలో జైలుకు వెళ్లిన వారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దుర్మార్గానికి పాల్పడిన వారిని శింక్షించకుండా హిందువులను జైలుకు పంపించి మరో వర్గానికి కొమ్ము కాస్తున్నారు అని మండిపడ్డారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టు మళ్లీ షాక్ ఇచ్చింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలుగా శాసనసభ్యుడిగా తన ఎన్నిక చెల్లదన్న తీర్పుపై స్టే ఇవ్వాలని వనమా వెంకటేశ్వర్ రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. వనమా విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు మధ్యంతర తీర్పును న్యాయస్థానం కొట్టివేసింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత రెండు రోజులుగా వర్షాలు తగ్గడంలేదు.. బుధవారం రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది.. ఈ మేరకు తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నభారీ వర్షాల దృష్ట్యా తెలంగాణాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పటికి వర్షం తగ్గక పోవడంతో శుక్రవారం, 27 జులై కూడా సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. వర్షాలపై సమీక్షించ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం…