జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మండల పరిధిలోని గోప్లపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రాల నర్సింహులు, మల్లెపోగు యాదయ్య, శివతో పాటు 30 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామ శివారులో దాదాపు 100 కోతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మునిగడపకు చెందిన కొందరు గ్రామస్థులు శనివారం తమ పొలాల సమీపంలో కోతులు మృతి చెందడం చూసి స్థానిక అధికారులకు సమాచారం అందించారు.
ప్రముఖ నటుడు, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కూకట్పల్లి నుంచి బరిలోకి దిగుతున్నట్లు.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో ఇప్పటికే చర్చలు జరిపిందని, ఆయన కూడా అందుకు ఓకే చెప్పారంటూ వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై తాజాగా బండ్ల గణేశ్ ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) వేదికగా స్పందించారు.
మిస్టర్ నడ్డా తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫేక్ సర్వేలు పెడుతుంది.. బీజేపీ జాకీ పెట్టిన తెలంగాణలో లేవదు.. కాంగ్రెస్ గెలవదు అని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ దెబ్బకు బిజెపి డక్ ఔట్..కాంగ్రెస్ రన్ ఔట్..కేసీఆర్ సెంచరీ చేయడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులే లేరు.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చుడే ఎక్కువ.
బీజేపీ నేత బీఎల్ సంతోష్ అంటున్నాడు.. తెలంగాణ లో హంగ్ వస్తుంది అని.. బీజేపీని నిలవరించడానికి కాంగ్రెస్ కొట్లాడుతుంది అని రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హంగ్ వస్తే బీజేపీతో కలిసేది ఎవరు.. బీఆర్ఎస్ కాదా?.. అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. కాంగ్రెస్ ఆకాశం లాంటిది.. ఆకాశంపై ఉమ్మితే మీపైనే పడుతుంది అంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పేరు దుబాయ్ కేసీఆర్.. దుబాయ్ ఏజెంట్ కొడుకు నా పై మాట్లాడటం విడ్డురంగా ఉందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డబ్బు తో 4 హెలికాప్టర్ లల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.