ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేటితో 61 వసంతాలు పూర్తి చేసుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుకు ఆధారంగా ఈ ప్రాజెక్టు నిలుస్తోంది. 1963 జులై 26న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శంకుస్థాపన చేసి.. దీనిని ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు.
తెలంగాణ అసెంబ్లీలో రేపు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. 2 లక్షల 95 వేల కోట్ల నుంచి 3 లక్షల మధ్య బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.. రాష్ట్ర బడ్జెట్ 2024-25 కు ఆమోదం తెలుపనుంది కేబినెట్.. ఇక, మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి మల్లు భట్టి…