Off The Record: తెలంగాణ బీజేపీలో కేంద్ర బడ్జెట్ ప్రకంపనలు..
- తెలంగాణ బీజేపీలో బడ్జెట్ ప్రకంపనలు..
- భగ్గుమంటున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్..
- స్వయంగా విరుచుకుపడ్డ సీఎం రేవంత్రెడ్డి..
- 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేశారంటున్న బీఆర్ఎస్..
- కేంద్ర మంత్రులిద్దరూ రాజీనామా చేయాలని డిమాండ్..
- డిఫెన్స్ మోడ్లో తెలంగాణ బీజేపీ లీడర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టుగా ఉందట తెలంగాణ బీజేపీ వ్యవహారం. కేంద్రం ప్రవేశ పెట్టిన జనరల్ బడ్జెట్ ఇక్కడ కాషాయ దళంలో ప్రకంపనలు రేపుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం, బడ్జెట్ స్పీచ్లో ఎక్కడా నిర్మలాసీతారామన్ తెలంగాణ పేరు ఎత్తక పోవడంపై భగ్గుమంటున్నాయి రాష్ట్ర కాంగ్రెస్, బీఆర్ఎస్. తెలంగాణ పట్ల ప్రధాని మోడీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు సీఎం రేవంత్రెడ్డి. పలుమార్లు ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి ఏం కావాలో వినతి పత్రాలు ఇచ్చినా.. పట్టించుకోలేదని విమర్శించారాయన. మీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తారా? మిగతా వాళ్ళు అవసరం లేదా అని కూడా ప్రశ్నించారు సీఎం. అటు బీఆర్ఎస్ కూడా అదే రీతిలో అటాక్ మోడ్లోకి వచ్చేసింది. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే… వాళ్ళు చేసింది ఏంటని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మోడీ ముందు మోకరిల్లారు తప్ప… వాళ్ళ హోదాతో రాష్ట్రానికి ఏం తెచ్చారు? వాళ్ళకు సొంత గడ్డ ప్రయోజనాలు అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు గులాబీ లీడర్స్. వెంటనే వారిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
విభజన చట్టం హామీలు ఒక్క ఆంధ్రప్రదేశ్ కేనా.. తెలంగాణకు అవసరం లేదా సమాధానం చెప్పాలని కూడా అడుగుతున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు. రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఒక్కుమ్మడిగా మొదలైన ఈ దాడితో రాష్ట్ర బీజేపీ నేతలు డిఫెన్స్లో పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిని ఎలా సమర్ధించుకోవాలో, ఏం సమాధానం చెప్పుకోవాలో అర్ధంగాక సతమతం అవుతున్నారట టీజీ బీజేపీ లీడర్స్. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో చెప్పుకోలేని పరిస్థితిలో… ఇంతగా విమర్శలు వస్తున్నా స్పందించలేకపోతున్నారట కేంద్ర మంత్రులు , తెలంగాణ బీజేపీ ఎంపీలు. తమ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటే… కౌంటర్ ఇవ్వలేని స్థితిలో ఉండటంపై బీజేపీ వర్గాల్లో సైతం చర్చ జరుగుతోందంటున్నారు.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
దీంతో ఇప్పుడీ సమస్య నుంచి కాషాయ దళం ఎలా బయట పడుతుందని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణకు కేటాయించాల్సిన నిధులు, ఇవ్వాల్సిన అనుమతుల పై కేంద్రం వివక్ష చూపుతోందంటూ ఏకంగా తీర్మానం చేసేసింది తెలంగాణ అసెంబ్లీ. చర్చ సందర్భంగా మాట్లాడిన సభ్యులు కేంద్రం వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మామూలు రాజకీయ విమర్శలు చేయడం వేరు, అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయడం వేరు. అసెంబ్లీ తీర్మానం తర్వాత ఇది జనంలోకి బలంగా వెళ్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్న క్రమంలో ఇది నెగెటివ్ ఎఫెక్ట్ అవుతుందా అని కూడా భయపడుతున్నాయట టీజీ బీజేపీ వర్గాలు. ఫైనల్గా పార్టీ పెద్దలు దీన్ని ఎలా కవర్ చేసుకుంటారో చూడాలి మరి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!