గ్రూప్ 1 పిటీషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటీషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మెయిన్స్ జవాబు పత్రాలు పున:మూల్యాంకనం చేయాలని పిటీషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల లాయర్లు మెయిన్స్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటున్నారు. పిటీషన్లపై ఈ రోజు వాదనలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. వాదనలు మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని సూచించింది. ఏప్రిల్లో జరిగిన విచారణ సందర్బంగా గ్రూప్1 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. నియామకాలపై…
పటాన్ చెరు (మం) చిట్కుల్ లో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాన్ కి టవల్ చుట్టుకుని ఆడుకుంటుండగా.. కరెంట్ రావడంతో టవల్ మెడకు చుట్టుకుని తొమ్మిదేళ్ల చిన్నారి మృతిచెందింది. ఇంట్లో కరెంట్ లేకపోవడంతో అక్కాతమ్ముడు ఇద్దరు ఫ్యాన్ కి టవల్ కట్టుకుని ఊయల ఊగుతున్నారు. ఫ్యాన్ స్విచ్ ఆన్ లో నే ఉంది. ఊయల ఊగుతున్న సమయంలో ఒక్కసారిగా కరెంట్ రావడంతో ఫ్యాన్ తిరగడంతో చిన్నారి సహస్ర మెడకు టవల్ బిగ్గర చుట్టుకుపోయింది. Also Read:Damodara Raja Narasimha…
Damodara Raja Narasimha : తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంపై మరింత దృష్టి సారించింది. ముఖ్యంగా కొత్తగా నిర్మితమవుతున్న టిమ్స్ హాస్పిటల్స్తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అత్యాధునిక వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్, ఫర్నీచర్ కొనుగోలుకు సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త టెక్నాలజీతో కూడిన…
ప్రేమ కోసం ప్రాణాలు తీయడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రామచంద్రపురం పి యస్ పరిధిలోని బండ్లగూడ బాలాజీనగర్ లో చోటుచేసుకుంది. చనిపోయిన యువతిని రమ్యగా గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రియుడు ప్రవీణ్ ను ఆస్పత్రికి తరలించారు. Also Read:Hacking: ఇది…
హైదరాబాద్ MCRHRD లో స్టేట్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్-2025 కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ అనే థీమ్ తో.. తమ బాధను చెప్పుకోలేని వారికి రక్షణ కల్పించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఎంతో కీలకమైన అంశంపై సదస్సు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసు, ఇతర నిర్వాహకులను…