Group-1 Exam: గ్రూప్-1 పరీక్షపై హైకోర్టులో పిటిషన్.. అభ్యర్థుల పట్ల వివక్ష లేదన్న టీజీపీఎస్సీ
- గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ..
- తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదు..
- ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులే హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారు: టీజీపీఎస్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-1 Exam: గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదన్నారు. నామినల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించినట్లు చెప్పారు. కోఠిలోని ఓ కేంద్రంలో పరీక్ష రాసిన వారే ఎక్కువ మంది ఎంపికయ్యారనేది అవాస్తవం.. అక్కడ ఉన్న రెండు పరీక్ష కేంద్రాలలో 1500 మంది అభ్యర్థులు మెయిన్స్ రాశారు.. మిగతా పరీక్షా కేంద్రాల్లో రాసిన వాళ్లలో అంతకంటే ఎక్కువ మందే ఎంపికయ్యారు అని పేర్కొన్నారు. కోఠిలోని రెండు కేంద్రాలు కేవలం మహిళలకు కేటాయించడంతో సౌకర్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాం అన్నారు. ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు ఏవేవో అనుమానాలతో పిటిషన్లు దాఖలు చేశారు.. వారు చేస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు కేవలం అపోహలు మాత్రమే ఉన్నాయని టీజీపీఎస్సీ తరపు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి తెలిపారు.
Read Also: Gender Change: పెళ్లి కోసం లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి.. చివరకు అత్యాచారం కేసు..
Also Read
అయితే, గ్రూప్-1 పరీక్షకు ఎంపికైన తెలుగు మీడియం అభ్యర్థులు 9.95 శాతం, ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు 89.88 శాతం, ఉర్దూ మీడియం 0.1 శాతంగా ఉన్నారని కోర్టుకు తెలిపారు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి. ఏపీలో రెండేళ్ల క్రితం నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షల్లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు.. టీజీపీఎస్సీకి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదు అని తేల్చి చెప్పారు. అందరికీ ఎక్ప్ పర్ట్ ఎంపిక చేసిన అంశాల ఆధారంగా మార్కులు వేశారని వెల్లడించారు. కాగా, ఇవాళ ప్రభుత్వం తరపున వాదనలు ముగిశాయి. తదుపరి పిటిషనర్స్ తరపున వాదనలు సోమవారం రోజున పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ తీర్పును వాయిదా వేసింది హైకోర్టు.
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!