Group-1 Exam: గ్రూప్-1 పరీక్షపై హైకోర్టులో పిటిషన్.. అభ్యర్థుల పట్ల వివక్ష లేదన్న టీజీపీఎస్సీ
- గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ..
- తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదు..
- ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులే హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారు: టీజీపీఎస్సీ
Group-1 Exam: గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదన్నారు. నామినల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించినట్లు చెప్పారు. కోఠిలోని ఓ కేంద్రంలో పరీక్ష రాసిన వారే ఎక్కువ మంది ఎంపికయ్యారనేది అవాస్తవం.. అక్కడ ఉన్న రెండు పరీక్ష కేంద్రాలలో 1500 మంది అభ్యర్థులు మెయిన్స్ రాశారు.. మిగతా పరీక్షా కేంద్రాల్లో రాసిన వాళ్లలో అంతకంటే ఎక్కువ మందే ఎంపికయ్యారు అని పేర్కొన్నారు. కోఠిలోని రెండు కేంద్రాలు కేవలం మహిళలకు కేటాయించడంతో సౌకర్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాం అన్నారు. ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు ఏవేవో అనుమానాలతో పిటిషన్లు దాఖలు చేశారు.. వారు చేస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు కేవలం అపోహలు మాత్రమే ఉన్నాయని టీజీపీఎస్సీ తరపు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి తెలిపారు.
Read Also: Gender Change: పెళ్లి కోసం లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి.. చివరకు అత్యాచారం కేసు..
Also Read
- Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
అయితే, గ్రూప్-1 పరీక్షకు ఎంపికైన తెలుగు మీడియం అభ్యర్థులు 9.95 శాతం, ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు 89.88 శాతం, ఉర్దూ మీడియం 0.1 శాతంగా ఉన్నారని కోర్టుకు తెలిపారు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి. ఏపీలో రెండేళ్ల క్రితం నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షల్లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు.. టీజీపీఎస్సీకి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదు అని తేల్చి చెప్పారు. అందరికీ ఎక్ప్ పర్ట్ ఎంపిక చేసిన అంశాల ఆధారంగా మార్కులు వేశారని వెల్లడించారు. కాగా, ఇవాళ ప్రభుత్వం తరపున వాదనలు ముగిశాయి. తదుపరి పిటిషనర్స్ తరపున వాదనలు సోమవారం రోజున పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ తీర్పును వాయిదా వేసింది హైకోర్టు.
తాజావార్తలు
-
NBK 112 : ‘బాలయ్య-కొరటాల’ మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్
-
Sanju Samson: “నా విజయ రహస్యం ఇదే”.. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు!
-
PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
-
UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!