ఐఏఎస్ అధికారులకు మూడేళ్లకోసారి బదిలీలు జరుగుతాయి. ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ట్రాన్స్ఫర్లు ఉంటాయి. తెలంగాణలో కొందరు IASలు మాత్రం ఏళ్ల తరబడి తాము పనిచేస్తున్నచోట కుర్చీలకు అతుక్కుపోయారు. అక్కడి నుంచి కదిలితే ఒట్టు. అధికార వర్గాల్లో ప్రస్తుతం వారి గురించి ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఒకే పోస్టులో మూడేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న కొందరు ఐఏఎస్లు..! తెలంగాణ కేడర్లో దాదాపు 150 మంది IASలు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు కేంద్ర సర్వీసుల్లో ఉంటే.. మరికొందరు రాష్ట్రంలోనే వివిధ…
కొత్తగా టీఆర్ఎస్లో ఒకరి చేరిక.. ఆ జిల్లాలో ఇద్దరిని టెన్షన్ పెట్టిస్తోందా? ఆ ఇద్దరిలో ఒకరు మంత్రి కావడంతో అధికారపార్టీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయా? పార్టీ వర్గాలు ఒక అంచనాకు రాలేని పరిస్థితి ఉందా? ఇంతకీ ఎవరి ప్లేస్ రీప్లేస్ కానుంది? టీఆర్ఎస్లో చల్మెడ చేరికతో జిల్లా రాజకీయాల్లో చర్చ..! కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలు రోజుకోలా మారుతున్నాయి. మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు తనయుడు లక్ష్మీ నరసింహారావు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో కొత్త సమీకరణాలు.. సరికొత్త…
పెట్టుబడులు, అధిక వడ్డీల పేరిట ప్రముఖల దగ్గర కోట్ల రూపాయలు కొట్టేసిన శిల్పను కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు… రెండోరోజు ప్రశ్నించారు. పెట్టుబడుల పేరిట కోట్లాది రూపాయలు వసూలు డబ్బు ఎక్కడికి తరలించారనే కోణంలో విచారణ జరిపారు. ఎంతమంది నుంచి డబ్బు వసూలు చేశారు?..తీసుకున్న సొమ్మును ఏం చేశారనే కోణంలో ఆరా తీశారు. గండిపేట్ సిగ్నేచర్ విల్లాస్లో ఉంటున్న శిల్ప దంపతులు అధిక వడ్డీలు అంటూ వీఐపీలను బురిడీ కొట్టించి కోట్లు వసూలు…
సభ్యత్వంపై దృష్టి సారించింది టీ కాంగ్రెస్. గాంధీభవన్లోజరిగిన సీనియర్ల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముప్పై లక్షల సభ్యత్వం టార్గెట్గా చేయాలని నిర్ణయించారు నేతలు. సభ్యత్వ నమోదుకు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జ్లను నియామకం చేశారు. వీరు ఎప్పటికప్పుడు సమన్వయం చేయనున్నారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కో ఆర్డినేటర్లను కూడా నియమించనుంది పార్టీ. ఈ నెల 24 తర్వాత పూర్తి స్థాయిలో సభ్యత్వం మీద సమీక్షలు చేయనున్నారు. సభ్వతం తీసుకున్న వారికి రెండు లక్షల ఇన్సూరెన్స్ చేయనున్నారు.…
సింగరేణిలో మూడు రోజుల సమ్మె ముగిసింది.భూగర్భ గనులతోపాటు ఓపెన్ కాస్టుల్లో పనిచేసే కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.మంచిర్యాల ,కొమురం భీం జిల్లాల్లోని బెల్లంపల్లి ,మందమర్రి,శ్రీరాంపూర్ ఏరియల్లో సమ్మె కారణంగా గనులు బోసిపోయాయి. 72 గంటలపాటు సాగిన సమ్మెలో గుర్తింపు సంఘమైన తెలంగాణ బోగ్గు గని కార్మిక సంఘం, జాతీయ కార్మిక సంఘాలు AITUC, INTUC, HMS, BMS, CITU లు సమ్మెలో పాల్గొన్నాయి. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు…
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు కొంచెం పెరిగాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,978 శాంపిల్స్ పరీక్షించగా… 188 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 193 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,78,142 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,70,246 కు పెరిగాయి..…
తెలంగాణ మంత్రి కేటీఆర్ తన విధులతో ఎప్పుడూ బిజీగా కనిపిస్తుంటారు. ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంటారు. ఒక్కోసారి మీట్ విత్ కేటీఆర్ పేరుతో సోషల్ మీడియాలో నెటిజన్లతో చిట్చాట్ కూడా నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను కూడా మంత్రి కేటీఆర్ నెటిజన్లతో పంచుకుంటారు. Read Also: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 100 మంది మృతి తాజాగా మంత్రి కేటీఆర్ తాను 2001లో లండన్లో ఉన్నప్పటి…
ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక ఆ జిల్లాలోని లోకల్ బాడీ ఓటర్ల ఆశలపై నీళ్లు చల్లిందా? ఇతర జిల్లాల్లోని క్యాంపులు ఈర్ష్యగా మారాయా? పోటీ లేకపోవడంతో పదో.. పాతికో రాకుండా పోయాయని వాపోతున్నారా? వాళ్ల నారాజ్కు కారణం ఇదేనా? పోటీ ఉంటే పదో.. పరకో వస్తుందని ఆశించారట..! ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండుకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు పోటీలేకుండా ఏకగ్రీవం అయ్యాయి. దీంతో గులాబీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఓటర్లయిన.. ఎంపీటీసీ.. జడ్పీటీసీ… కౌన్సిలర్లు మాత్రం నారాజ్లో ఉన్నట్టు…
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించాలని మృతుడి ఇంటి ముందు ఆమె నిరాహార దీక్షకు దిగారు. మృతుడు రవికుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇచ్చేంత వరకు కదిలేది లేదని షర్మిల ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షర్మిల నిరాహార దీక్షను భగ్నం చేసి ఆమెను అదుపులోకి…
సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న బీజేపీ జిల్లా శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి. అక్కడ ఆయన మాట్లాడుతూ… సిద్దిపేట ప్రజల్లో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉంది,దుబ్బాక, హుజురాబాద్ లో గెలిచినట్టు సిద్దిపేట లో గెలిచేందుకు వ్యూహ రచన చేస్తున్నాం అన్నారు. ఇక రాష్ట్రంలో అవినీతి చెత్త కుప్పలా తయారైంది,రాష్ట్రం ఓకె కుటుంబం గుప్పిట్లో బంది అయ్యింది. బీజేపీ వైపు చాలా మంది ఎదురు చూస్తున్నారు,వేములవాడలో ఎన్నికలు వస్తే…